లోయలో పడిన బస్సు: 20మంది క్రీడాకారుల మృతి
మెక్సికన్ సిటీ: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతిచెందగా, మరో 25 మంది గాయపడ్డారు.
అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వెరాక్రూస్ ప్రాంతంలో 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జి రెయిలింగ్ను ఢీకొని అటోయక్ నదిలో పడిపోయింది.
ప్రమాద సమాచారం అందుకున్న సహాయ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులంతా కమరోన్, కోర్డోబా ప్రాంతాలను చెందిన ఫుట్బాల్ క్రీడాకారులేనని అధికారులు తెలిపారు.
బస్సు డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే అదుపులో తప్పి లోయలో పడివుంటుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఘటనపై మెక్సికన్ అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నియటో తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications