9మంది అమాయకులు బలి: ఆఫ్గన్ సైన్యం కాల్పులు, విచారణకు గవర్నర్ ఆదేశం!
కాబూల్: అఫ్గనిస్థాన్ భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో 9మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఐసిస్ సహా మరికొంతమంది ఉగ్రవాదులు నాంగర్హర్ ప్రావిన్స్లోని ఓ శిబిరంలో ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి.
సోమవారం రాత్రి చపార్హర్ జిల్లాలో జరిపిన ఈ కాల్పుల్లో తొమ్మిది మంది అమాయకులు చనిపోయారు. ఉగ్రవాదులు అనుకుని సామాన్యులపై భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. మృతుల్లో స్థానిక పోలీసు కమాండర్ కూడా ఉండటం గమనార్హం.

ఘటనపై గవర్నర్ హయతుల్లా హయత్ స్పందించారు. భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టిన ఇంటి నుంచి కాల్పుల శబ్దం వినిపించిందని, అనంతరం అక్కడికి వెళ్లి చూస్తే చనిపోయినవాళ్లంతా సామన్యులేనని వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నట్టు చెప్పారు.
కాబూల్ లో పేలుడు ఘటన:
ఆఫ్గన్ రాజధాని కాబూల్ లో బాంబు పేలుడు చోటు చేసుకుంది. సైకిల్ కు అమర్చిన బాంబు పేలడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఖరాబాగ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా గవర్నర్ మహమ్మద్ అజీం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దాడిలో మరో నలుగురు సామాన్యులతో పాటు ముగ్గురు పోలీసులు చనిపోయినట్టు తెలిపారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications