'ఎంహెచ్370' తర్వాత ఎయిర్ ఏషియా ప్రకటన, సారీ: శిథిలాలు (పిక్చర్స్)
ఇండోనేషియా: 2014 మార్చి 8వ తేదీన ఎంహెచ్ 370 విమానం గల్లంతైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎయిర్ ఏషియా ఓ ప్రకటన చేశారు. ఇప్పుడు అది చర్చనీయాంశమైంది. మార్చిలో ఎంహెచ్ 370 విమానం గల్లంతైంది. ఆ తర్వాత నెలలో అంటే ఆ విమానం గల్లంతైన ఆరు వారాల తర్వాత ఎయిర్ ఏషియా ఓ ప్రకటన చేసింది.
తమ పైలట్ ప్రయాణీకులను సురక్షితంగా తీసుకు వస్తాడని, తమ విమానాల్లో ప్రయాణించే వారు ఎటువంటి భయం చెందవలసిన అవసరం లేదని దాని సారాంశం. ఆ ప్రకటన చేసిన ఎనిమిది నెలల తర్వాత ఇప్పుడు ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కూలింది.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి. (https://www.facebook.com/oneindiatelugu)
అయితే, అలాంటి సమయంలో ఎయిర్ ఏషియా ప్రకటన పైన విమర్శలు వచ్చాయి. ఎయిర్ ఏషియా కూడా దాని పైన ఆ తర్వాత క్షమాపణలు చెప్పింది. తాము ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమాపణలు చెబుతున్నామని ఎయిర్ ఏషియా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాతుక్ మెరనన్ ఆ తర్వాత చెప్పారు.
కాగా, సురబయ - సింగపూర్ విమానం క్యూజెడ్ 8501 విమానం జావా సముద్రంలో కూలిపోయినట్లుగా ఇండోనేషియా అధికారులు ధృవీకరించిన విషయం తెలిసిందే. 162 మందితో అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానాన్ని గుర్తించామని ఇండోనేషియా సివిల్ ఏవియేషన్ అధికారులు మంగళవారం ప్రకటించారు.
ఈ ప్రమాదంలో 155 మంది ప్రయాణీకులు, 7గురు సిబ్బంది మృతి చెందారు. ఈ ప్రయాణీకులలో 149 మంది ఇండోనేషియన్లు, ముగ్గురు కొరియన్లు, సింగపూర్, బ్రిటన్, మలేషియా దేశాలకు చెందిన ఒక్కరు చొప్పున ఉన్నారు. కాగా, మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తామని ఎయిర్ ఏషియా చీఫ్ చెప్పారు.