మరో దేశ ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానం అదృశ్యం
ఇరాన్ దేశాధ్యక్షుడి ఘటన మరువకముందే అలాంటి ఘటనే మరోటి వెలుగుచూసింది. ఆఫ్రికా దేశమైన మలావీ (Malawi) ఉపాధ్యక్షుడు సౌలోస్ క్లాస్ చిలీమా (Saulos Klaus Chilima) ప్రయాణిస్తున్న సైనిక విమానం అదృశ్యమైంది. ఆ దేశాధ్యక్షుడు లాజరస్ చక్వేరా కార్యాలయం ఈ విషయాన్ని ధృవీకరించింది.
మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ క్లాస్ చిలీమా తోపాటు మరో తొమ్మిది మందితో ఓ సైనిక విమానం సోమవారం దేశ రాజధాని లిలాంగ్వే నుంచి బయల్దేరింది. షెడ్యూల్ ప్రకారం 45 నిమిషాల అనంతరం ఎంజుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. అయితే, ఆ సమయానికి అక్కడికి చేరుకోలేదు.
.

ఆ విమానం రాడార్ నుంచి అదృశ్యమైందని, దీంతో విమానయాన అధికారులు కాంటాక్ట్ కోల్పోయారని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. వెంటనే గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించిన అధ్యక్షుడు చక్వేరా.. తన బహామాస్ పర్యటనకు రద్దు చేసుకున్నట్లు వెల్లడించింది.
కాగా, ఇటీవల ఇరాన్ అధ్యక్షుడ ఇబ్రహీం రైసీ(63) హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. దీంతో అధ్యక్షుడు రైసీతోపాటు హెలికాప్టర్లో ఉన్నవారంతా మరణించారు. ఇంతలోనే మరో దేశ ఉపాధ్యక్షుడు కూడా ఇలాంటి ప్రమాదంలోనే అదృశ్యమవడం చర్చనీయాంశంగా మారింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications