భారతీయులకు అలర్ట్: సుడాన్లో ఖాళీగా ఇండియన్ ఎంబసీ, యూఎన్ చీఫ్తో జైశంకర్ చర్చలు
ఖార్తూమ్: సుడాన్లో పరిస్థితులు దిగజారుతున్నాయి. సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పులు, బాంబు పేలుళ్లతో సూడాన్ రాజధాని ఖార్తూమ్ సహా పరిసర ప్రాంతాలు కూడా దద్ధరిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో సూడాన్లోని భారతీయులను మరోసారి భారత ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సూడాన్లోని భారత రాయబార కార్యాలయానికి ఎవరూ వెళ్లొద్దని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది.
ఖార్తూమ్ విమానాశ్రయ పరిసరాల్లో ఘర్షణలతో కల్లోల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దానికి సమీపంలోనే ఉన్న భారత దౌత్య కార్యాలయంలో ప్రస్తుతం సిబ్బంది ఎవరూ లేరని తెలిపింది. అయితే, రాయబార కార్యాలయం తెరిచే ఉందని.. సిబ్బంది మాత్రం వేర్వేరు చోట్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ వివరించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా సురక్షితంగా ఉండాలో సూడాన్లోని భారతీయులకు సూచిస్తున్నాం. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. అక్కడి భారత రాయబార కార్యాలయం పనిచేస్తోంది. అయితే, ఆ ప్రాంతంలో తీవ్ర ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో.. ఎవరూ అక్కడికి వెళ్లొద్దని సూచించాం. ప్రస్తుత దౌత్య కార్యాలయంలో సిబ్బంది కూడా ఎవరూ లేరు. వారంతా ఇతర ప్రాంతాల నుంచి సేవలు అందిస్తున్నారని అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు.
భారతీయుల భద్రతే తమ ప్రాధాన్య అంశమని ఆయన స్పస్టం చేశారు. మరోవైపు, సూడాన్లో చోటు చేసుకుంటున్న ఘర్షణ వాతావరణంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ను కలిసి చర్చించారు. జైశంకర్ ప్రస్తుతం న్యూయార్క్లోనే ఉన్నారు. సూడాన్లో శాంతిభద్రతలు నెలకొనేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
#WATCH | We had a very good meeting. Most of our meeting was on the Sudan situation. We also discussed the G20, and Ukraine conflict, but essentially it was about Sudan. In Sudan, the UN is trying to establish a ceasefire and that is really key because at the moment, unless there… https://t.co/6s08TBr3KH pic.twitter.com/hSbg1DKLov
— ANI (@ANI) April 20, 2023
కాగా, సుడాన్లోని భారతీయులు దాదాపు 4,000 మంది ఉన్నారు. వీరిలో 1,200 మంది దశాబ్దాల క్రితం అక్కడ స్థిరపడ్డారు. అక్టోబరు 2021లో జరిగిన తిరుగుబాటులో సూడానీస్ మిలటరీ అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి దేశాన్ని సార్వభౌమ మండలి ద్వారా నడిపించింది. సూడాన్పై నియంత్రణపై ఆ దేశ సైన్యం, శక్తివంతమైన పారామిలటరీ దళం మధ్య సోమవారం వరుసగా మూడో రోజు పోరు కొనసాగింది. ఈ పోరాటంలో గత రెండు రోజుల్లో 200 మందికిపైగా సామాన్యులు చనిపోయారు. అదే సమయంలో, 1,800 మందికిపైగా గాయపడ్డారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications