నెమలి సింహాసనం ఇరాన్ చేరిన రోజు.. ప్రతీకారం కోరుతోందా?
ప్రస్తుతం ప్రపంచ రాజకీయాలు, భద్రతా సమీకరణలు అన్నీ కూడా ఇరాన్ చుట్టూనే తిరుగుతున్నాయి. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఒత్తిళ్లు, పవర్ పాలిటిక్స్ ... ఇవన్నీ ఇరాన్ను గ్లోబల్ ఫోకస్లో నిలిపాయి. ఇరాన్ దేశంలో గత రెండు వారాలుగా కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు రక్తసిక్తంగా మారాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు దాదాపు 2,000 మంది మరణించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ ఆందోళనల్లో ఇంత భారీ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంలోనే చరిత్రకారులు ఒక అపురూప అధ్యాయాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారు.. అదే భారత నెమలి సింహాసనం (Peacock Throne).
ఒకప్పుడు భారత ఉపఖండ వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ సింహాసనం, నేడు ఇరాన్ చరిత్రతో ముడిపడి ఉండటం అనేక ప్రశ్నలకు దారి తీస్తోంది. మొఘల్ సామ్రాజ్య వైభవానికి చిరస్థాయిగా నిలిచిన నెమలి సింహాసనాన్ని, చక్రవర్తి షాజహాన్ 1628లో తయారు చేయించారు. ఇది కేవలం ఒక రాజసింహాసనం కాదు.. ఇది భారత సంపద, కళా నైపుణ్యం, సామ్రాజ్య శక్తికి అద్దం పట్టే కళాఖండం.

నెమలి సింహాసనాన్ని స్వర్ణకారులు ఏడేళ్ల పాటు నిరంతరంగా శ్రమించి, సుమారు 1150 కిలోల బంగారాన్ని ఉపయోగించి.. 230 కిలోల విలువైన మణులు,రత్నాలతో అలకరించి ఈ అద్భుత సృష్టిని రూపొందించారు. ఈ సింహాసనంలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన రత్నాలు పొదగబడ్డాయి. ప్రఖ్యాత కోహినూర్ వజ్రం, పౌరాణిక ఖ్యాతి గల తైమూర్ రూబీ, మాణిక్యాలు, పచ్చలు, ముత్యాలు... అన్నీ కలిసి ఈ సింహాసనాన్ని ప్రపంచంలోనే అత్యంత విలువైన కళాఖండంగా నిలిపాయి. నెమలి ఆకారంలో రూపొందించిన ఈ సింహాసనం, మొఘల్ రాజసభకు శోభనిచ్చేది.
కాలచక్రం తిరిగింది. 18వ శతాబ్దానికి వచ్చేసరికి మొఘల్ సామ్రాజ్యం బలహీనపడింది. అదే సమయంలో పర్షియా పాలకుడు నాదిర్ షా ఢిల్లీపై దాడి చేశాడు. 1739లో జరిగిన ఈ ఆక్రమణ భారత చరిత్రలో అత్యంత విధ్వంసకర ఘటనగా మిగిలిపోయింది. ఢిల్లీని దోచుకున్న నాదిర్ షా, అపార సంపదతో పాటు.. నెమలి సింహాసనాన్ని కూడా ఇరాన్కు తీసుకెళ్లాడు.అది కేవలం దోపిడీ కాదు... భారత వైభవానికి జరిగిన ఒక చారిత్రక అవమానం.
నెమలి సింహాసనం అసలు రూపంలో నేటికి లెకపోయినా, అది ఇరాన్ రాజవంశాలపై గాఢమైన ప్రభావం చూపింది. ఇరాన్లోని రాజసభల వైభవం, సింహాసన రూపకల్పనలు.. అన్నింటిలోనూ భారతీయ కళా ప్రభావం కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే... భారత సంపద, కళా నైపుణ్యం ఇరాన్ రాజశక్తికి ప్రతీకగా మారింది.
నేడు ఇరాన్ ఎదుర్కొంటున్న రాజకీయ అస్థిరత, అంతర్జాతీయ ఒత్తిళ్లు, అంతర్గత నిరసనలు చూస్తుంటే... చరిత్ర మళ్లీ ఒక ప్రశ్న వేస్తోంది. ఆక్రమణల ద్వారా తెచ్చుకున్న వైభవం, సంపద శాశ్వత స్థిరత్వాన్ని ఇవ్వగలదా? అని. నాదిర్ షా అపార సంపదను భారత్ నుంచి తీసుకెళ్లినా, అతని పాలన ఎక్కువకాలం నిలబడలేదు. అతని సామ్రాజ్యం కూడా కాలగర్భంలో కలిసిపోయింది.
భారత్కు నెమలి సింహాసనం ఒక కళాఖండం మాత్రమే కాదు.అది ఒక చరిత్రాత్మక గాయం, ఒక తీరని నష్టం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ కళాఖండాల తిరిగి రాకపై చర్చ జరుగుతున్న ప్రతి సందర్భంలో, నెమలి సింహాసనం పేరు తప్పకుండా వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాలు ఇరాన్ చుట్టూ తిరుగుతున్న వేళ, భారత నెమలి సింహాసనం కథ ఒక విషయం స్పష్టంగా చెబుతోంది.
శక్తి, సంపద, ఆక్రమణలపై నిర్మితమైన వైభవం శాశ్వతం కాదు. చరిత్ర చివరికి తన తీర్పు ఇస్తుంది. కాలం మారినా... దేశాలు మారినా... చరిత్ర చెప్పే పాఠాలు మాత్రం మారవు. మరి నిజంగానే నెమలి సింహాసనం ప్రతీకారం కోరుతోందా?
-
న్యూస్ ఛానళ్లకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్..! -
ఈ రోజు ఇరాన్ కు చుక్కలే.. చంపేస్తాం: ట్రంప్ సంచలనం -
మనం మనం బరంపురం.. !! -
ట్రంప్ కు మిత్రదేశం బిగ్ షాక్..! సీక్రెట్ గా ఇరాన్ తో చర్చలు ? -
Viral Video: బాలయ్య డైలాగ్ చెప్పిన ఇరాన్ సైనికుడు..! తర్వాత మృత్యుఒడికి..! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం -
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్!












Click it and Unblock the Notifications