యుద్దమే! సిద్దంగా ఉండాలంటూ సైన్యానికి కిమ్ ఆదేశం: కొరియన్ వార్-2 దిశగా..
రెండో కొరియన్ యుద్దానికి సిద్దంగా ఉండాలంటూ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు.
ప్యోంగ్యాంగ్: ప్రత్యర్థి తమపై దాడి మొదలుపెట్టకముందే అప్రమత్తంగా వ్యవహరించాలని భావిస్తున్న అమెరికా.. ఇందుకోసం దక్షిణ కొరియా సహాయంతో అక్కడ తమ బలగాలను మోహరించిన సంగతి తెలిసిందే.
దాదాపు 17,500మంది అమెరికన్ 50 వేల మంది దక్షిణ కొరియా సైనికులు దక్షిణ కొరియాలో ఉల్కీ-ఫ్రీడమ్ గార్డియన్ మిలటరీ డ్రిల్ చేపడుతున్నారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న మిలటరీ డ్రిల్ అగస్టు 31వ తేదీన ముగియనుంది.
ఈ పరిణామాలతో ఆందోళన చెందుతుందనుకున్న ఉత్తరకొరియా అందుకు పూర్తి విరుద్దంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. కాళ్లబేరానికి రావడమో.. లేక యుద్దం ఆలోచనను పూర్తిగా విరమించుకుంటామని ఆ దేశం ప్రకటిస్తుందని అమెరికా భావించినప్పటికీ.. పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదు.
రెండో కొరియన్ యుద్దానికి సిద్దంగా ఉండాలంటూ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తమ సైనికులకు ఆదేశాలు జారీ చేయడమే ఇందుకు నిదర్శనం. 1950లో దక్షిణకొరియా-ఉత్తరకొరియా మధ్య తొలి కొరియన్ యుద్దం చోటు చేసుకుంది.
కాగా,
అమెరికా-
దక్షిణ
కొరియా
సంయుక్తంగా
చేబడుతున్న
ఉల్కీ-ఫ్రీడమ్
గార్డియన్
మిలటరీ
డ్రిల్లో
ఆస్ట్రేలియా,
బ్రిటన్,
కెనడా,
కొలంబియా,
డెన్మార్క్,
నెదర్లాండ్,
న్యూజిలాండ్
అధికారులు
కూడా
పాల్గొంటారని
తెలుస్తోంది.
రోజురోజుకు
అమెరికాకు
మద్దతు
పెరుగుతుండటం..
తమ
బద్ద
శత్రువైన
దక్షిణ
కొరియా
ఆ
దేశానికి
స్థావరంలా
మారడం
ఉత్తరకొరియాను
కలవరపెట్టే
అంశమే.
అయినప్పటికీ
ఆ
దేశం
పరిస్థితులను
ధీటుగా
ఎదుర్కోవాలనే
భావిస్తుందే
తప్ప..
వెనక్కి
తగ్గాలన్న
ఆలోచన
చేయడం
లేదు.
ఇందుకు తగ్గట్లే ఉత్తరకొరియా మీడియాలోను వార్తలు రావడం గమనార్హం. అమెరికా-దక్షిణ కొరియా చేపట్టబోతున్న మిలటరీ డ్రిల్ ను అక్కడి పత్రిక 'అణు యుద్దానికి నిర్లక్ష్యపూరిత కసరత్తులు' అని పేర్కొంది. ఇలాంటి పరిస్థితులు నియంత్రణ లేని అణుయుద్దానికి దారితీస్తాయని దారి తీస్తాయని తెలిపింది.