ఉగ్రదాడి: దేశాధ్యక్షుడి కాన్వాయ్ పేల్చివేత
ట్యునిష్: ఉగ్రవాదులు మరో దేశం మీద విరుచుకుపడ్డారు. ఈసారి ఉగ్రవాదుల లక్షం ఆదేశాధ్యక్షుడు. అయితే బాంబు పేలుడు జరిగిన సమయంలో ఆ కాన్వాయ్ లో అధ్యక్షుడు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఉత్తర ఆఫ్రికాలోని ట్యునీషియా రాజధాని ట్యునిష్ నగరం నడిబొడ్డున అధ్యక్షుడి కాన్వాయ్ లోని బస్సును శక్తివంతమైన బాంబులతో పేల్చి వేశారు. ఈ ఉగ్రదాడిలో ట్యునీషియా అధ్యక్షుడు బెంజీ ఖాయిద్ ఎసెబ్సీ అంగరక్షకులు 15 మంది సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు.
స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ట్యనీషియా రాజధాని ట్యునిష్ నగరం నడిబొడ్డున అధ్యక్షుడి కాన్వాయ్ వెలుతున్నది. ఇదే కాన్వాయ్ లో ఆయన అంగరక్షకులు ఓ బస్సులో ప్రయాణిస్తున్నారు.

ఉగ్రవాదులు దేశాధ్యక్షుడు బెంజీ ఖాయిద్ ఎసెబ్సీని టార్గెట్ చేసుకుని బాంబుదాడులకు పాల్పడ్డారు. ఆ సమయంలో ఆ కాన్వాయ్ లో అధ్యక్షుడు బెంజీ ఖాయిద్ ఎసెబ్సీ లేరని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడి ఉంటారని అధికారులు తెలిపారు.
నెల రోజుల పాటు ట్యునీషియాలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశం మొత్తం హై అలర్ట్ ప్రకటించింది. ప్యారిస్ లో ఉగ్రదాడి జరిగిన తరువాత ఫ్రాన్స్ లో ఎమర్జెన్సీ విధించారు. ఇప్పుడు ట్యునిష్ లో ఈ ఉగ్రదాడి జరగడంతో ట్యునీషియా లో నెల రోజులు ఎమర్జెన్సీ విధించారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications