Baba Vanga మాటే శాసనం..- దశాబ్దాల కిందటే ఇరాన్- ఇజ్రాయెల్ వార్ పై జోస్యం
ఇరాన్పై దాడుల అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వరకే ఇది పరిమితం కాలేదు. గల్ఫ్ దేశాలకూ పాకింది. భారతీయులు.. ప్రత్యేకించి తెలుగువాళ్లు ఎక్కువగా నివసించే కువైట్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ వంటి దేశాలపైనా దాడులు సాగాయి. బహ్రెయిన్ లో ఏకంగా అమెరికా నావల్ బేస్ సైతం ఇరాన్ సంధించిన శక్తిమంతమైన మిస్సైళ్ల ధాటికి భస్మీపటలం అయింది.
ఇరాన్, ఇజ్రాయెల్, బహ్రెయిన్, యూఏఈ, ఖతార్లపై ఏకకాలంలో బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది ఇరాన్. అమెరికా, ఇజ్రాయెల్ల సంయుక్త దాడికి ప్రతీకారంగా ఈ చర్యకు దిగింది. ఈ దాడులు.. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలను మరింత పెంచాయి. అమెరికా, ఇజ్రాయెల్ జాయింట్ గా ఇరాన్లోని కీలక స్థావరాలపై దాడులు చేయగా.. దీనికి ప్రతిదాడికి దిగింది ఇరాన్. బహ్రెయిన్లోని యూఎస్ నేవీ బేస్ ను ధ్వంసం చేసిపడేసింది.

ఈ దాడుల వార్తలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడంతో- ఇక అందరి దృష్టి కూడా బల్గేరియన్ మహిళా ఆధ్యాత్మికవేత్త బాబా వంగా అంచనాలపై పడింది. 1996లో బాబా వంగా మరణించారు. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆమె అప్పట్లోనే ఊహించారు. 2026 ప్రారంభంలోనే తూర్పు నుండి ఓ మహా యుద్ధం ఆరంభమౌతుందని ఆమె చెప్పిన జోస్యం చెప్పారు. ఇది ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టినట్టయిందని చాలామంది విశ్వసిస్తోన్నారు.
తాజా పరిణామాలను బాబా వంగా జోస్యంతో ముడిపెడుతూ సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చలు జరుగుతున్నాయి. ఈ ఘర్షణ క్రమంగా ప్రపంచమంతటా విస్తరించవచ్చని, ఆమె భవిష్యవాణి నిజమవుతోందని భావిస్తున్నారు. తాజాగా చోటు చేసుకుంటోన్న దాడులు ఒక్క ఇరాన్- ఇజ్రాయెల్ కే పరిమితం కావట్లేదు. గల్ఫ్ దేశాలన్నింటినీ ఆవంరించింది.
బాబా వంగా జోస్యం ప్రకారం- ఇది పాశ్చాత్య ప్రపంచాన్ని ముఖ్యంగా యూరప్ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. యూరప్లోని భూమి పూర్తిగా నిస్సారంగా, అస్థిరంగా మారవచ్చని దశాబ్దాల కిందటే ఆమె అంచనా వేశారు, ఇది విస్తృతమైన ఆర్థిక, సామాజిక సవాళ్లకు దారితీస్తుంది. ఈ యుద్ధం తర్వాత రష్యా ఒక ప్రధాన ప్రపంచ శక్తిగా అవతరించి, అంతర్జాతీయ శక్తి సమతుల్యాన్ని పునర్నిర్మించగలదని అప్పట్లో పేర్కొన్నారు.
ఈ ఏడాదిలోనే శక్తిమంతమైన భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు తలెత్తుతాయని కూడా ఆమె అంచనా వేశారు. ఇవి మానవులకు, భూమికీ ఎంతగానో ప్రమాదకరమని హెచ్చరించారు. విపత్తులు భూమిని చుట్టుముట్టుతాయని పేర్కొన్నారు. ఇప్పుడు ఇరాన్- ఇజ్రాయెల్ సంక్షోభం వాస్తవ రూపాన్ని దాల్చిన నేపథ్యంలో ఈ విపత్తులు కూడా మానవాళికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయనడంలో సందేహాలు ఉండకపోవచ్చు.
-
రైతులకు కేంద్రం శుభవార్త: ఆ వస్తువులపై భారీగా పన్ను మినహాయింపులు -
ఈ సాయంత్రం మోదీ అత్యవసర భేటీ- కఠిన నిర్ణయాల దిశగా కేంద్రం? -
అగ్నికి ఆజ్యం పోసిన ట్రంప్- క్రూడ్ రేట్లు జంప్ -
డొనాల్డ్ ట్రంప్ నాన్చివేత ధోరణి- 19 నిమిషాల ప్రసంగంలో ఇరాన్ భవిష్యత్ -
సైలెంట్ కిల్లర్స్: ఇరాన్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ఇజ్రాయెల్ 'యూనిట్ 8200'!! -
యుద్ధంపై ప్రధాని మోదీ కీలక మీటింగ్.. సంచలన నిర్ణయాలు ఇవే.. -
ఇజ్రాయెల్ భీకర ప్రతీకారం: హిజ్బుల్లా మాస్టర్మైండ్ హతం! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..!












Click it and Unblock the Notifications