బంగ్లాదేశ్: మాస్కులు ధరించి వచ్చి.. ఇంట్లో ఉన్న ఎంపీ కాల్చివేత
ముసుగు ధరించి వచ్చిన దుండగులు అధికార అవామీ లీగ్ పార్టీ ఎంపీ మంజురుల్ ఇస్లాంలిషన్ను శనివారం సాయంత్రం గయిబంద జిల్లాలోని ఆయన ఇంటి వద్ద కాల్చేశారని పోలీసులు తెలిపారు.
ఢాకా: బంగ్లాదేశ్లో ఓ ఎంపీని ఆయన ఇంటి వద్దే కాల్చి చంపారు. ముసుగు ధరించి వచ్చిన దుండగులు అధికార అవామీ లీగ్ పార్టీ ఎంపీ మంజురుల్ ఇస్లాంలిషన్ను శనివారం సాయంత్రం గయిబంద జిల్లాలోని ఆయన ఇంటి వద్ద కాల్చేశారని పోలీసులు తెలిపారు.
వరద ఎఫెక్ట్, భారత్ టు బంగ్లాదేశ్ జర్నీ: 1700 కి.మీ. నడిచి ఏనుగు మృతి
నలుగురు మాస్కు ధరించిన వ్యక్తులు మోటారు సైకిల్ పైన వచ్చారని తెలిపారు. వారు ఎంపీ ఇంటిలోకి దూసుకెళ్లారన్నారు. ఇంట్లో ఆయనను దగ్గర నుంచి కాల్చివేసి, అనంతరం సంఘటన స్థలం నుంచి పారిపోయారన్నారు.
కాగా, ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) నుంచి స్ఫూర్తిపొందిన ఇస్లామిస్ట్ ఉగ్రవాదులు ఇటీవల బంగ్లాదేశ్లో దురాఘతాలకు పాల్పడుతున్నారు. గత కొద్దికాలంగా బంగ్లాలో పదుల సంఖ్యలో సెక్యులర్ బ్లాగర్లను, రచయితలను, మైనార్టీ వర్గం వారిని, విదేశీయుల పైన దాడి చేయడం లేదా చంపడం చేస్తున్నారు.
గత ఏడాది (2016) జూలై నెలలో జరిగిన దాడిలో 20 మంది చనిపోయారు. ఇందులో 17 మంది విదేశీయులు. ఢాకాలోని ఓ రెస్టారెంటులో దాడి తీవ్రవాదుల దాడి జరిగింది. అప్పుడు దీనికి ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) బాధ్యత వహించింది.