తెలుగు టెక్కీ హత్య: ఎలా పట్టుబడ్డాడు, ఏం చెప్పాడు?
తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల హత్య కేసులో నిందితుడైన ఆడమ్ ప్యూరిటన్ సోమవారంనాడు కోర్టులో హాజరయ్యాడు. అతను చాలా నెమ్మదిగా మాట్లాడినట్లు చెబుతున్నారు.
హ్యూస్టన్ :తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఇరాన్ దేశస్థుడనుకుని తాను కాల్పులు జరిపినట్లు నిందితుడు ఆడమ్ ప్యూరింటన్ కోర్టుకు చెప్పాడు. ఫస్ట్ డిగ్రీ హత్య, ఫస్ట్ డిగ్రీ హత్యాయత్నం అభియోగాలను ఆయనపై మోపారు.
కాల్పులు జరిపిన తర్వాత ప్యూరింటన్ 70 మైళ్ల దూరం పారిపోయాడు. క్లింటన్ోని ఆపిల్ బే రెస్టారెంట్కు వెళ్లి అటెండర్కు హత్య విషయం చెప్పాడు. తనమతో పాటు ఉంటానని ప్యూరింటన్ అడిగాడని, దానికి అంగీకరిస్తే ఏం జరిగిందో చెప్తానని అన్నాడని బార్ అటెండర్ తెలిపాడు.
తాము సరేనని చెప్పడంతో జరిగిందంతా చెప్పాడని అతను అన్నాడు. తాను వెంటనే 911కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించడంతో ప్యూరింటన్ను అరెస్టు చేసినట్లు అతను తెలిపాడు. ప్యూరింటన్ కోరిక మేరకు అతడి తరఫున వాదించేందుకు న్యాయవాదిని జాన్సన్ కౌంటీ డిస్ట్రిక్ట్ జడ్జి నియమించారు. రెండు మిలియన్ డాలర్ల బాండుతో అతన్ని జైలుకు పంపించారు. ఐదు నిమిషాల్లో విచారణ ముగిసింది.

అమెరికాలో గల కాన్సస్లోని ఓ పబ్లో జాత్యహంకార దాడికి పాల్పడిన 51 ఏళ్ల నిందితుడు ఆడమ్ ప్యూరింటన్ సోమవారంనాడు కోర్టుకు హాజరయ్యాడు. అతను జరిపిన కాల్పుల్లో తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల మరణించగా, మరో ఇద్దరు గాయపడిన విషయం తెలిసిందే.
అమెరికా నావికాదళ మాజీ అధికారి అయిన ప్యూరింటన్ను తొలిసారిగా పోలీసులు సోమవారంనాడు కోర్టు ముందు హాజరుపరిచారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతన్ని కోర్టులో హాజరు పరిచారు. విచారణలో భాగంగా అడిగిన ప్రశ్నలన్నింటికీ ఏ మాత్రం తొణకకుండా ప్యూరింటన్ సమాధానమిచ్చాడని తెలుస్తోంది.
ప్యూరింటన్ జాత్యహంకార నేరానికి పాల్పడినట్టు డిస్ట్రిక్ట్ కోర్టులో రుజువైతే ఆయనకు 50 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. గత బుధవారంనాడు ఓలెత్లోని బార్లో ప్యూరింటన్ 'మా దేశం విడిచి వెళ్లిపోండి' అని గట్టిగా అరుస్తూ తెలుగు యువకులపై కాల్పులు ఆయన జరిపినట్లు చెబుతున్నారు.
ఈ దాడిలో శ్రీనివాస్ కూచిభొట్ల అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఇద్దరు యువకులు గాయపడ్డారు. గాయపడినవారిలో తెలుగు టెక్కీ ఆలోక్ ఉన్నాడు. కాల్పులు అనంతరం అక్కడి నుంచి మాయమైన ప్యూరింటన్ను వెస్ట్ సెంట్రల్ మిస్సౌరీలోని హెన్రీ కౌంటీలో అరెస్టు చేశారు.
ఫస్ట్ డిగ్రీ మర్డర్, ఫస్ట్ డిగ్రీ హత్యాయత్నం కింద ఆయనపై అభియోగాలు నమోదు చేశారు. జాన్సన్ కౌంటీ జైలులో ప్రస్తుతం ఆయనను ఉంచారు. కాగా, ఈ కేసులో సాక్ష్యాధారాలను సేకరణకు ఎఫ్బీఐ సహకరిస్తోంది. తిరిగి ఈ నెల 9వ తేదీన అతను కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications