భారత్ పై యుద్ధం తప్ప మరో దారి లేదు.. పాకిస్థాన్ సంచలన వ్యాఖ్యలు
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. సింధూ నది జలాల పంపిణీ నిలిపివేత, పాక్ పౌరులకు వీసాల జారీ రద్దు, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత, ఇరు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు నిలిపివేత, ఇరు దేశాల మధ్య గగనతలం మూసివేత.. తదితర చర్యలతో పాకిస్థాన్ ఇప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
సింధూ నదీ జలాల పంపిణీ నిలిపివేతను పున: సమీక్షించుకోవాలని ఇప్పటికే భారత్ కు పాకిస్థాన్ నాలుగుసార్లు లేఖలు రాసింది. పాకిస్థాన్ లో నీటి సంక్షోభం తలెత్తుతోందని లేఖలో పేర్కొంది. అయితే పాకిస్థాన్ రాసిన లేఖలను భారత్ పట్టించుకోలేదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) ను అప్పగిస్తేనే నీటిని విడుదల చేస్తామని తేల్చేసింది. తాజాగా ఇదే విషయంపై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(PPP) నాయకుడు బిలావల్ బుట్టో జర్దారీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ లో భారత్ ఒప్పందాలకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచనలు చేశారు.
ఇటీవల జర్మనీ బ్రాడ్ కాస్ట్ కు డీడబ్యూ ఉర్దూ అనే ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్ లోని పీపుల్స్ పార్టీ(PPP) నాయకుడు బిలావల్ బుట్టో జర్దారీ షాకింగ్ కామెంట్స్ చేశారు. పాకిస్థాన్ కు భారత్ నీటిని నిలిపివేయడంపై మండిపడ్డారు. ఇలానే కొనసాగిస్తే మరోసారి యుద్ధం జరగక తప్పదని బుట్టో వార్నింగ్ ఇచ్చారు. భారత్ కు నాలుగు లేఖలు రాసినా పట్టించుకోవడం లేదని.. భారత్ వైఖరి ఇలానే కొనసాగితే యుద్ధం తప్ప మరో గత్యంతరం లేదని తేల్చారు. అయితే పాకిస్థాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని కానీ దేశ భద్రత, నీటి హక్కులపై పాక్ ఎక్కడివరకైనా వెళ్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు భుట్టో.

భారత్- పాకిస్థాన్ చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య చర్చలను పరిష్కరించుకోవాలని పాకిస్థాన్ లోని పీపుల్స్ పార్టీ(PPP) నాయకుడు బిలావల్ బుట్టో జర్దారీ పేర్కొన్నారు. పాక్ తో చర్చలకు సహకరించాలన్నారు. భారత్ వైఖరిని ఖండించాలని ఈ మేరకు ప్రపంచ దేశాలకు భుట్టో పిలుపునిచ్చారు. భారత్- పాకిస్థాన్ చర్చలతో దక్షిణాసియాలో శాంతి నెలకుంటుందని వివరించారు. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పాలని అమెరికాను కోరారు భుట్టో.
-
"పాకిస్థాన్ లో నిద్రలేచిన నరరూప రాక్షసులు.. భారత్ కు పెను ముప్పు" -
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!!












Click it and Unblock the Notifications