జేపీ నడ్డా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. రష్యాకు బాసటగా నిలవాలని సందేశాలు
భారతీయ జనతా పార్టీకి ఊహించని పరిణామాణం ఎదురైంది. ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. సైబర్ కేటుగాళ్లు నడ్డా ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసినట్లు ప్రాథమికంగా నిర్థారణ అయింది. సైబర్ నేరగాళ్లు ఉక్రెయిన్ - రష్యా మధ్య జరుగుతున్న ముద్ధం గురించి కూడా ప్రస్తావించారు.. రష్యా ప్రజలకు మద్దతు ఇవ్వాలన్నారు. క్రిఫ్టోకరెన్సీ, బిట్ కాయిన్స్పై కూడా ట్విట్ చేశారు.
BJP national president JP Nadda's Twitter account hacked. pic.twitter.com/AdZ3fh7pd3
— ANI (@ANI) February 27, 2022
జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతాలో బిట్కాయిన్ లింకులు
సైబర్ కేటుగాళ్లు జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతాలో ఈ ట్విట్ చేసి డబ్బులు గుంజే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. బిట్ కాయిన్, ఇథేరియం, క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన లింకులను కూడా ట్విట్టర్ ఖాతాలో ఉంచారు. ప్రజల కోసం తాము ఈ డబ్బులు వసూలు చేస్తున్నట్లు ట్విట్ పెట్టారు. దీంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కార్యాలయ సిబ్బంది వెంటనే గ్రహించారు. హ్యాక్ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. కొంత సేపు తర్వాత జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతాను రీస్టోర్ చేశారు.
భద్రతా మండలిలో తీర్మానం ఓటింగ్కు భారత్ ధూరం
Recommended Video
ఇదిలా ఉండగా .. ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండిస్తూ అమెరికా , అల్బేనియా కలిసి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దీనికి 11 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. భారత్ , చైనా, యూఏఈ ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా హ్యాక్ కు గురవడం చర్చనీయాంశమైంది.