లిబియా జలాల్లో నౌక మునక: 200 మంది జల సమాధి
ట్రిపోలి: మధ్యధరా సముద్రంలో గురువారం నాడు మరో వలస నౌక జల సమాధి అయింది. ఈ ఘోర ప్రమాదంలో దాదాపు 200 మంది చనిపోయి ఉండొచ్చని లిబియా కోస్ట్ గార్డు అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
జువారా పట్టణం నుండి 400 మందితో కిక్కిరిసిన ఓ నౌక ఇటలీ వైపు బయలుదేరుతూ లిబియా తీర ప్రాంతంలో మునిగి పోయింది. తీర గస్తీ దళాలు 201 మందిని కాపాడాయి. అందులో ఆఫ్రికాకు చెందిన 147 మంది అక్రమంగా వలస వెళ్తున్నట్లు తెలిసింది.

వారందరిని నిర్బంధంలోకి తీసుకున్నట్లు సమాచారం. ఆఫ్రికా, పాకిస్తాన్, సిరియా, మొరాకో, బంగ్లాదేష్ తదితర దేశాల నుండి జల సమాధి అయిన నౌకలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గురువారం జరిగిన వేర్వేరు ఘటనల్లో 1,430 మందిని లిబియా సముద్ర జలాల్లో కాపాడినట్లు ఇటలీ సంస్థ ఒకటి పేర్కొంది.
More From
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications