బాక్సింగ్ డే సునామీ.. 14 దేశాలు, 2,27,000 మరణాలు
Boxing Day Tsunami: భూకంపాలు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. రష్యాలో బుధవారం 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ప్రపంచాన్ని వణికించింది. రష్యా, జపాన్లోని కొన్ని తీర ప్రాంతాల్లో అలల ఉద్ధృతి కనిపించడంతో ఈ విపత్తు 2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీని గుర్తుకు తెస్తోంది. చరిత్రలోనే అత్యంత ఘోర సహజ విపత్తుల్లో ఒకటిగా నిలిచిన 2004 బాక్సింగ్ డే సునామీ ప్రపంచవ్యాప్తంగా 14 దేశాలను ప్రభావితం చేసి లక్షలాది మంది ప్రాణాలను బలిగొంది. 2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్రంలో సంభవించిన 9.1-9.3 తీవ్రత గల భూకంపం వల్ల ఏర్పడిన సునామీ మానవాళిని తీవ్రంగా కలచివేసింది.
భూకంపం.. సునామీ ఆవిర్భావం
2004 డిసెంబర్ 26న ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం సమీపంలో సముద్ర గర్భంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం హిందూ మహాసముద్ర అడుగు భాగాన్ని తీవ్రంగా కదిలించడంతో అసాధారణమైన భారీ సముద్రపు అలలు ఏర్పడ్డాయి. ఈ అలలు ఏకంగా 30 మీటర్ల(దాదాపు 98 అడుగులు) ఎత్తువరకు ఎగిసిపడి, తీర ప్రాంతాలవైపు దూసుకుపోయాయి. ఈ విపత్తును 'బాక్సింగ్ డే సునామీ' అని పిలుస్తారు. ఎందుకంటే ఇది బాక్సింగ్ డే రోజున (క్రిస్మస్ తర్వాత రోజు) సంభవించింది. ఈ సునామీ వల్ల హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ఈ విషాదం బారిన భారతదేశంతో సహా 14 దేశాలు పడ్డాయి. ఇండోనేషియా, శ్రీలంక, భారత్, థాయిలాండ్, మాల్దీవులు అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ విపత్తులో దాదాపు 2.30 లక్షల మంది మరణించారు. ఇది ఆధునిక చరిత్రలో అత్యంత ఘోరమైన సహజ విపత్తు.

తీరప్రాంతాలు పూర్తిగా నాశనం
ఈ బాక్సింగ్ డే సునామీ తీరప్రాంత సమాజాలను పూర్తిగా నాశనం చేసింది. ఇండోనేషియాలోని ఆచె ప్రావిన్స్లో 1.70 లక్షల మందికి పైగా ప్రజలు మరణించారు. శ్రీలంకలో 35 వేల మందికి పైగా మరణించారు. సముద్రపు అలలు తీర ప్రాంతాలను పూర్తిగా ధ్వంసం చేశాయి. మత్స్యకారులు, పర్యాటక పరిశ్రమలు ఎక్కువగా నష్టపోయాయి. ఉప్పు నీరు పొలాలను, మట్టిని నిస్సారంగా మార్చింది. దీనివల్ల ప్రజలు శాశ్వతంగా తమ జీవనోపాధిని కోల్పోయారు. శ్రీలంకలో 'క్వీన్ ఆఫ్ ది సీ' అనే ఒక రైలు అలల్లో కొట్టుకుపోయింది. దీనివల్ల 2,000 మంది మరణించారు. మాల్దీవుల మొత్తం ఆర్థిక వ్యవస్థ నాశనమైంది. ఈ నష్టం దాని జీడీపీలో 62 శాతం. ఈ విపత్తులో మొత్తం 17 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దీనితో పాటు పర్యావరణానికి భారీ నష్టం వాటిల్లింది. పగడపు దిబ్బలు, మడ అడవులు ధ్వంసమయ్యాయి.
ఎఫెక్ట్ అయిన దేశాలు
ఈ విపత్తు వల్ల భారత్, ఇండోనేషియా, శ్రీలంక, థాయిలాండ్, మాల్దీవులు, మయన్మార్, మలేషియా, సీషెల్స్, సోమాలియా, టాంజానియా, కెన్యా, మారిషస్, మడగాస్కర్, దక్షిణాఫ్రికా దేశాలు భారీగా ప్రభావితమయ్యాయి. ఇండోనేషియాలోని బాందా ఆచె అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. ఆ ప్రాంతంలో రాకాసి అలలు 20 నిమిషాల్లో తీరానికి చేరుకున్నాయి. దీనివల్ల లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే సమయం కూడా దొరకలేదు. తూర్పు ఆఫ్రికాలో భూకంపం సంభవించిన ఏడు గంటల తర్వాత కూడా అలలు విధ్వంసం సృష్టించాయి. సోమాలియాలో 300 మందికి పైగా మరణించారు. ఈ సునామీ మెక్సికో, చిలీ, ఆర్కిటిక్ వరకు చేరుకుంది.
బిలియన్ల డాలర్లలో సంపద నష్టం
బాక్సింగ్ డే సునామీ వల్ల దాదాపు 13 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. ఇండోనేషియాలో మాత్రమే 6 బిలియన్ డాలర్ల నష్టం జరిగింది. ఇది ఆచె ప్రావిన్స్ జీడీపీకి సమానం. మాల్దీవులలో 470 మిలియన్ డాలర్లు (జీడీపీలో 62శాతం) నష్టం జరిగింది. శ్రీలంకలో ఒక బిలియన్ డాలర్ల ప్రత్యక్ష నష్టం జరిగింది. ఇండియాలోని తమిళనాడు, అండమాన్-నికోబార్లో చేపల పెంపకం, మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లింది. ప్రపంచవ్యాప్తంగా పునర్నిర్మాణం కోసం 6.7 బిలియన్ డాలర్ల సహాయం సేకరించబడింది. ఇందులో ఆస్ట్రేలియా ఒక్కటే ఒక బిలియన్ డాలర్ల సహకారం అందించింది.
భారత్పై ప్రభావం
ఇండియాలో సునామీ అండమాన్-నికోబార్ దీవులు, తమిళనాడులోని తీర ప్రాంతాలను అత్యధికంగా ప్రభావితం చేసింది. అధికారిక గణాంకాల ప్రకారం 10,700 మందికి పైగా మరణించారు. 5,640 మంది గల్లంతయ్యారు, వీరిలో ఎక్కువ మంది అండమాన్-నికోబార్కు చెందినవారు. తమిళనాడులో చెన్నై, నాగపట్టణం వంటి ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అలలు తీరం నుంచి చాలా కిలోమీటర్ల లోపలికి చొచ్చుకుపోయాయి, దీనివల్ల మత్స్యకార గ్రామాలు, ఇళ్లు, మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లింది. అండమాన్లో అనేక ద్వీపాలు నీట మునిగాయి. చాలా వరకు గిరిజన తెగలకు చెందిన ప్రజలు ఎక్కువగా నష్టపోయారు. ఒంగే వంటి స్థానిక గిరిజన తెగలకు తీరని నష్టం వాటిల్లింది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications