బుర్కినా ఫాసోలో రెచ్చిన ఉగ్రవాదులు: కాల్పులు, బాంబుల మోత
ఔగాడౌగోవ్: పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసో ఉగ్రవాదులు భీకర దాడులతో రెచ్చిపోయారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం నుంచి రాజధాని ఔగాడౌగోవ్ నగరంలో ఉగ్రవాదులు విరుచుకుపడుతున్నారు.

కారులో వచ్చిన ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులకు, బాంబు దాడులకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు ఆర్మీ హెడ్ క్వార్టర్స్తోపాటు ఫ్రాన్స్ రాయబార కార్యలయంపై దాడి జరిగినట్లు అధికారులు ధృవీకరించారు.
ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన సైన్యం ఉగ్రవాదులను మట్టుపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. కాగా, అమెరికా రాయబార కార్యాలయం కూడా ఈ ఉగ్రదాడిని ట్విట్టర్లో తెలియజేసింది. అయితే, ఈ ఉగ్రదాడిలో ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications