ఘోరం: కుమార్తెను మైక్రోఒవెన్లో పెట్టి చంపిన తల్లి
కాలిఫోర్నియా: కన్నతల్లి అనే విషయాన్ని ఆ మహిళ మర్చిపోయి తనలోని క్రూరత్వాన్ని ప్రదర్శించింది. కన్న కూతురనే కనికరం లేకుండా.. ఏడాది చిన్నారిని మైక్రోవేవ్ ఒవెన్లో పెట్టి అత్యంత దారుణంగా చంపేసింది ఆ తల్లి.
కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో 2011లో జరిగిన ఈ ఘటనపై విచారణ జరిపిన న్యాయస్థానం కన్నతల్లిని దోషిగా తేల్చి.. జీవిత ఖైదు విధించింది. కేసు వివరాల్లోకి వెళితే.. కా యాంగ్(34) అనే యువతి తన కుమార్తెను ఐదు నిమిషాలు ఓవెన్లో ఉంచింది.
రేడియేషన్ వేడి కారణంగా చిన్నారి అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. యాంగ్కు మూర్ఛ వ్యాధి ఉందని.. ఏం చేస్తుందో తెలియకుండానే తన ఏడాది పాపను మైక్రోవేవ్ ఒవెన్లో ఉంచిందని ఆమె తరఫు న్యాయవాది చెప్పడాన్ని ప్రాసిక్యూటర్ తోసిపుచ్చారు.
నిర్మాణ సంస్థ పనులకు ఆటంకం కలిగిస్తోందని పాపపై యాంగ్ కోపంగా ఉందని.. ఈ నేపథ్యంలోనే ఉద్దేశపూర్వకంగానే చిన్నారిని చంపిందని స్పష్టం చేశారు. కాగా, ఆమెకు మరో ముగ్గురు సంతానం కూడా ఉన్నారు.