పైలట్ పొగ త్రాగడం వల్ల ఆ విమానం ప్రమాదం జరిగి 51 మంది మృతి
ఖాట్మాండ్: యూఎస్-బంగ్లా ఎయిర్లైన్ బాంబార్డియర్ యూబీజీ 211 విమానం గత ఏడాది కూలిపోయి, 51 మంది మృతి చెందారు. దీనికి కారణం పైలట్ పొగత్రాగడమే కారణమని విచారణలో తేలింది. విమానం నడుపుతున్న పైలట్ కాక్పిట్లో పొగ త్రాగటం వల్ల ఆ విమానం ప్రమాదానికి గురైనట్లుగా గుర్తించారు.
గత ఏడాది మార్చిలో నేపాల్లో ఈ విమానం ప్రమాదానికి గురైంది. దర్యాప్తు అనంతరం ప్రమాదానికి గల కారణాలు వెల్లడయ్యాయి. కాక్పిట్లో పొగ త్రాగడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తేల్చారు. యూఎస్-బంగ్లా విమానయాన సంస్థకు చెందిన బంబార్డియర్ యూబీజీ 211 విమానాన్ని గత ఏడాది మార్చి 12న నేపాల్లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బంది సహా 51 మంది చనిపోయారు. ప్రమాదం జరిగినప్పుడు అందులో 67మంది ఉన్నారు. దీనిపై దర్యాఫ్తు చేపట్టారు. విచారణ చేపట్టిన ప్యానెల్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) పరిశీలించింది.
విమానం నడుపుతున్న సమయంలో పైలట్ నిబంధనలకు విరుద్ధంగా కాక్పిట్లోనే పొగ తాగినట్లు గుర్తించారు. కాక్పిట్లోని సిబ్బంది నిర్లక్ష్యం, ల్యాండింగ్ సమయంలో పరిస్థితిపై అవగాహన కోల్పోవడం కారణంగా విమానం క్రాష్ ల్యాండ్ అయినట్లు తెలిపింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications