కాల్పుల విరమణకు పాక్ తూట్లు.. పాకిస్థాన్ కు అండగా ఉంటాం.. చైనా సంచలన ప్రకటన
పాకిస్థాన్ మరోసారి దొంగ దెబ్బ తీసింది. కాల్పుల విరమణకు తల ఊపినట్లే ఊపి తోక జాడించింది. అర్థరాత్రి జమ్మూలో మోటార్ షెల్లింగ్, డ్రోన్ లతో వరుసగా నాలుగోరోజూ దాడులకు పాల్పడింది. పాక్ దాడుల్లో కశ్మీర్ ప్రభుత్వ అధికారి, ఇద్దరు భద్రతా అధికారులు సహా 7 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. నగ్రోటా వద్ద భారత్ లోకి చొరబడేందుకు పాకిస్థాన్ యత్నం చేసింది. అయితే చొరబాటుదారులపై భారత ఆర్మీ కాల్పులు జరిపింది.
మరోవైపు పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించడంపై భారత్ మండిపడింది. ఈ మేరకు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ల మధ్య టెలిఫోన్ సంభాషణ నడిచింది. 'పహల్గాం ఉగ్రదాడి వల్ల ఎంతో ప్రాణనష్టం జరిగింది. అందుకే ఉగ్రవాదంపై కీలక నిర్ణయం తీసుకున్నాం. భారతదేశానికి యుద్ధం అనేది ప్రాధాన్యం కాదు. భారత్, పాకిస్థాన్ తో కాల్పుల విరమణకు కట్టుబడి ఉంది.. అని అజిత్ దోవల్ తెలిపారు.
ఇక పహల్గాం ఉగ్రదాడిని చైనా కూడా ఖండించింది. ఉగ్రవాదాన్ని చైనా వ్యతిరేకిస్తుందని పేర్కొంది. అయితే భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తో.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడారు. తమ మిత్రదేశమైన పాకిస్థాన్ కు చైనా ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు సమాచారం.

అయితే పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం అత్యంత దుర్మార్గమని భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మండిపడ్డారు. నాలుగోరోజూ పాకిస్థాన్.. సరిహద్దుల వెంబడి కాల్పులకు, డ్రోన్ దాడులకు పాల్పడుతోందన్నారు. ఇది అత్యంత దుర్మార్గమని తెలిపారు. పాక్ దాడులకు భారత సైన్యం ధీటుగా తిప్పికొడుతోందన్నారు. కాల్పుల వివరణ ఒప్పందం ఉల్లంఘనకు సంపూర్ణ బాధ్యత పాకిస్థాన్ దేనని ఈ మేరకు మిస్రీ తెలిపారు.
Chinese Foreign Minister Wang Yi had a phone conversation with Indian National Security Advisor Doval
— ANI (@ANI) May 10, 2025
As per Chinese Foreign Ministry, "Doval said that the Pahalgam terrorist attack caused serious casualties among Indian personnel and that India needed to take counter-terrorism… pic.twitter.com/38ZyFkHrTN
ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారత్- పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ జరిగిందని తెలిపారు. ఈ మేరకు ఇరు దేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు తెలిపారు. ఈ మేరకు ఇరు దేశాలకూ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య నిన్న రాత్రి నుంచీ తాము జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలించాయన్నారు. భారత్, పాకిస్తాన్.. సమయస్ఫూర్తి, కామన్ సెన్స్ వాడినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications