చైనా ఫ్యాక్టరీలో గ్యాస్ పేలుడు: 17 మంది మృతి, ముగ్గురి పరిస్ధితి విషమం
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్లో ఆటో విడి విభాగాలు తయారుచేసే ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ పేలుడు సంభవించి 17 మంది మృతి చెందారు. ఈ ఘటన బుధవారం చైనా దక్షిణ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ పేలుడులో ప్రమాదంలో 17 మంది అక్కడిక్కడే మృతి చెందగా, మరో 33 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోషాన్ పట్టణంలోని పుహవా ఇంజనీరింగ్ అండ్ మ్యాను ఫాక్చరింగ్ కంపెనీలో బుధవారం ఉదయం మూడు పేలుళ్లు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ప్యాక్టరీలో సంభవించి గ్యాస్ పేలుడు కారణంగా సమీపంలోని మరో గ్లాస్ ఫ్యాక్టరీ కూడా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. ఐతే బుధవారం క్లీనింగ్ కోసం ప్యాక్టరీ మూసివేశారు. కేవలం క్లీనింగ్ విభాగానికి చెందిన వారు మాత్రమే ప్యాక్టరీలో ఉన్నట్లు అక్కడి అధికారిక న్యూస్ పేపర్ జిన్హువా పేర్కొంది.