చైనాలో పవర్ ప్లాంట్ కుప్పకూలి 68 మంది దుర్మరణం
బీజింగ్: చైనాలో నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్లాంట్ కుప్పకూలిపోవడంతో 68 మంది కార్మికులు దుర్మరణం చెందారు. తూర్పు చైనాలోని జియాంగ్స్ ఫ్రాన్సిస్ ప్రాంతంలోని ఫంగ్ చెంగ్ లో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణంలో ఉంది.
గురువారం ఈ విద్యుత్ ప్లాంట్ దగ్గర పనులు జరుగుతున్నాయి. అయితే ఒక్క సారిగా కట్టడం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 68 మందికి పైగా దుర్మరణం చెందారని చైనాకు చెందిన క్షినువా మీడియా తెలిపింది.

కట్టడం శిథిలాల కింద వంద మందికి పైగా కార్మికులు చిక్కుకున్నారని, వారిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. తీవ్రగాయాలైన క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.












Click it and Unblock the Notifications