వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చైనాలో పవర్ ప్లాంట్ కుప్పకూలి 68 మంది దుర్మరణం
బీజింగ్: చైనాలో నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్లాంట్ కుప్పకూలిపోవడంతో 68 మంది కార్మికులు దుర్మరణం చెందారు. తూర్పు చైనాలోని జియాంగ్స్ ఫ్రాన్సిస్ ప్రాంతంలోని ఫంగ్ చెంగ్ లో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణంలో ఉంది.
గురువారం ఈ విద్యుత్ ప్లాంట్ దగ్గర పనులు జరుగుతున్నాయి. అయితే ఒక్క సారిగా కట్టడం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 68 మందికి పైగా దుర్మరణం చెందారని చైనాకు చెందిన క్షినువా మీడియా తెలిపింది.
కట్టడం శిథిలాల కింద వంద మందికి పైగా కార్మికులు చిక్కుకున్నారని, వారిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. తీవ్రగాయాలైన క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.
Comments
English summary
At least 40 people have died and others are still trapped after a platform under construction at a power plant's cooling tower in eastern China's Jiangxi province collapsed on Thursday, state news agency Xinhua said.
Story first published: Thursday, November 24, 2016, 17:44 [IST]