Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కరోనా చివరిది కాదు ...తరువాత మహమ్మారికి సిద్ధంగా ఉండండి : డబ్ల్యూహెచ్ఓ సంచలన హెచ్చరిక

కరోనావైరస్ చివరి మహమ్మారి కాదని, తరువాత మరిన్ని మహమ్మారులు దాడి చేసే అవకాశం ఉందని , తరువాతి మహమ్మారి కోసం ప్రపంచం బాగా సిద్ధం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రేయేసస్ హెచ్చరించారు. తదుపరి మహమ్మారిని మెరుగైన రీతిలో ఎదుర్కోవటానికి ప్రపంచ దేశాలు ప్రజారోగ్యంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు . విలేకరుల సమావేశంలో టెడ్రోస్ మాట్లాడుతూ,ఇది చివరి మహమ్మారి కాదు. ఇలాంటి మహమ్మారుల వ్యాప్తి తరువాత కాలంలో కూడా కొనసాగుతుందని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టెన్షన్ పెడుతున్నాయి .

తదుపరి మహమ్మారికి సిద్ధం కావాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

తదుపరి మహమ్మారికి సిద్ధం కావాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

మహమ్మారి అనేది జీవిత సత్యం అని చరిత్ర మనకు బోధిస్తుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ పేర్కొన్నారు . అయితే తదుపరి మహమ్మారి వచ్చినప్పుడు ప్రపంచం సిద్ధంగా ఉండాలని ఆయన సంచలన హెచ్చరిక చేశారు .ఇప్పటి కంటే మన ఆరోగ్య రక్షణలో ఎక్కువగా మనం సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు . అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల సమీక్ష కమిటీ ఆ పనిని ప్రారంభిస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆరోగ్య నియంత్రణ ప్రపంచ ఆరోగ్య భద్రతలో అతి ముఖ్యమైన ఒక చట్టపరమైన వ్యవస్థ అని పేర్కొన్నారు టెడ్రోస్ .

 కరోనా మహమ్మారి ఒకటే చివరిది కాదు

కరోనా మహమ్మారి ఒకటే చివరిది కాదు

ఇప్పటివరకు మహమ్మారి సమయంలో వివిధ దేశాల పనితీరును ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ సమీక్ష కమిటీ అంచనా వేస్తుందని ఆయన చెప్పారు . అవసరమని భావించే ఏవైనా మార్పులను సిఫారసు చేయండి అని టెడ్రోస్ విలేకరుల సమావేశంలో అన్నారు. కరోనా మహమ్మారి ఒక్కటే ప్రపంచానికి చివరి మహమ్మారి కాదని, తరువాతి కాలంలో మరిన్ని ప్రాణాంతక మహమ్మారులు వచ్చే అవకాశం లేకపోలేదని, మహమ్మారి మానవ జీవితంలో ఒక భాగంగా ఉండే పరిస్థితి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ప్రస్తుతం కంటే మెరుగైన ఆరోగ్య సౌకర్యాలతో సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.

Recommended Video

    COVID-19 : Coronavirus పై పారదర్శకంగా వ్యవహరించాం! - చైనా అధ్యక్షుడు || Oneindia Telugu
    ప్రజారోగ్యానికి భారీగా ఖర్చు చేసేందుకు సిద్ధం కండి

    ప్రజారోగ్యానికి భారీగా ఖర్చు చేసేందుకు సిద్ధం కండి

    ప్రజారోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని, ప్రజారోగ్యానికి భారీగా ఖర్చు పెట్టే లాగా ప్రపంచ దేశాలు రెడీ గా ఉండాలని ఆయన పేర్కొన్నారు. కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా 27.19 మిలియన్లకు పైగా ప్రజలు సోకినట్లు లెక్కలు చెప్తున్నాయి . 888,326 మంది మరణించినట్లు తెలుస్తుంది .ఇక తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సంచలన హెచ్చరికతో అన్ని దేశాలు ఆలోచనలో పడ్డాయి. కరోనా కారణంగానే వైద్య సదుపాయాల కల్పనలో దృష్టి పెట్టిన చాలా దేశాలు , ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికతో ఆరోగ్య భద్రతపై మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంది .

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+