రూ.334 కోట్లు అవినీతి.. మాజీ మంత్రికి మరణ శిక్ష విధించిన న్యాయస్థానం !!
చైనాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. దేశంలో అవినీతి నిర్మూలనే ధ్యేయంగా జిలిన్ ప్రావిన్స్లోని కోర్టు చారిత్రాత్మక తీర్పు ప్రకటించింది. వ్యవసాయ, గ్రామీణ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి టాంగ్ రెన్జియాన్పై భారీ లంచాలు స్వీకరించిన ఆరోపణలు రుజువైన తరుణంలో ఆయనకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
టాంగ్ రెన్జియాన్ 2007 నుంచి 2024 మధ్య కాలంలో తన అధికారం దుర్వినియోగం చేసినట్లు కోర్టు విచారణలో తేలింది. వ్యాపార ఒప్పందాలు, ప్రభుత్వ ప్రాజెక్టులు, ఉద్యోగ నియామకాలలో అవకతవకలకు పాల్పడి ఆయన సుమారు 268 మిలియన్ యువాన్లు (దాదాపు ₹334 కోట్లు) స్వీకరించారు. నగదు మాత్రమే కాకుండా విలువైన వస్తువులను కూడా ఆయన పొందినట్లు ప్రభుత్వ వార్తాసంస్థ పేర్కొంది.

కోర్టు తీర్పు & ఆస్తుల జప్తు..
విచారణలో టాంగ్ తన నేరాన్ని అంగీకరించడంతో.. ఆయనకు విధించిన మరణశిక్షను కోర్టు రెండేళ్లపాటు వాయిదా వేసింది. ఈ సమయంలో ఆయన మళ్లీ నేరాలకు పాల్పడకపోతే శిక్ష జీవితఖైదుగా మారే అవకాశం ఉంది. అదనంగా ఆయన వ్యక్తిగత ఆస్తులు అన్ని జప్తు చేసి, లంచం ద్వారా సంపాదించిన మొత్తం డబ్బును దేశ ఖజానాకు బదిలీ చేయాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఆయనపై జీవితకాల రాజకీయ నిషేధం కూడా అమలులోకి వచ్చింది.
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ 2012లో అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని అత్యంత దృఢంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఉద్యమం కింద పది లక్షల మందికి పైగా అధికారులు శిక్షలను ఎదుర్కొన్నారు. వీరిలో ప్రావిన్స్ గవర్నర్లు, ఉన్నత మంత్రులు మాత్రమే కాకుండా సైనికాధికారులు కూడా ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ క్రమం విస్తరించి, విదేశాలకు పారిపోయిన కొంతమంది అవినీతి అధికారులను చైనా తిరిగి రప్పించింది.
టాంగ్ రెన్జియాన్ కేసు చైనాలో ప్రభుత్వ కఠిన వైఖరికి మరో ఉదాహరణగా నిలిచింది. ఎవరు ఎంతటి పెద్ద పదవిలో ఉన్నా, అవినీతికి పాల్పడితే శిక్ష తప్పదని ఈ తీర్పు స్పష్టంగా చూపిస్తోంది. ఇటువంటి చర్యలు ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
భవిష్యత్ సంకేతాలు..
ఈ తీర్పుతో చైనా ప్రభుత్వం అవినీతి విషయంలో తన జీరో టాలరెన్స్ విధానాన్ని పునరుద్ఘాటించింది. ముఖ్యంగా వ్యవసాయ రంగం, గ్రామీణాభివృద్ధి, సైనిక రంగాలలో మరింత కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది ఇతర అధికారులకు కూడా ఒక గట్టి హెచ్చరికగా నిలుస్తుంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications