Booker Prize 2025:డేవిడ్ స్జాలాయ్కు అవార్డు - కిరణ్ దేశాయ్ ఓటమి..!!
బ్రిటిష్ రచయిత డేవిడ్ స్జాలాయ్కు ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ (Booker Prize for Fiction) లభించింది. సోమవారం ప్రకటించిన ఈ అవార్డును ఆయన తన నవల 'ఫ్లెష్' (Flesh) కోసం గెలుచుకున్నారు. హంగేరీలో సామాన్య వ్యక్తిగా జీవితం మొదలుపెట్టి, బ్రిటన్లో అత్యంత ధనవంతుడిగా మారిన ఒక మనిషి జీవిత కథను, చెప్పని విషయాలకు కూడా ప్రాధాన్యతనిస్తూ, రచయిత ఈ నవలలో అద్భుతంగా చిత్రీకరించారు.
న్యాయ నిర్ణేతల ప్రశంసలు
విజేతగా స్జాలాయ్ను ప్రకటించిన న్యాయ నిర్ణేతలు ఆయన నవల గురించి ప్రశంసలు కురిపించారు.చాలా తక్కువ పదజాలంతో, అత్యంత సూటిగా సాగే ఈ నవల.. ఒక మనిషి జీవితాన్ని ఉత్కంఠభరితంగా, మళ్లీ మళ్లీ చదవాలనిపించేలా, చివరికి కదిలించే చిత్రంగా మారుస్తుందని జడ్జిలు పేర్కొన్నారు.

51 ఏళ్ల డేవిడ్ స్జాలాయ్.. భారత్ సంతతికి చెందిన ప్రముఖ రచయిత్రి కిరణ్ దేశాయ్ రాసిన 'ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ' (The Loneliness of Sonia and Sunny) నవలను వెనక్కి నెట్టి ఈ అత్యుత్తమ సాహిత్య పురస్కారాన్ని దక్కించుకున్నారు.
ఈ అవార్డు విజేతకు 50,000 పౌండ్ల (సుమారు $66,000) నగదు బహుమతితో పాటు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, నవల అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది.
కిరణ్ దేశాయ్ 2006లోనే 'ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్' (The Inheritance of Loss) నవల కోసం బుకర్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఈసారి గెలిచి ఉంటే, బుకర్ ప్రైజ్ 56 ఏళ్ల చరిత్రలో రెండుసార్లు ఈ అవార్డు గెలిచిన ఐదవ రచయిత్రిగా ఆమె రికార్డు సృష్టించేవారు, కానీ స్వల్ప తేడాతో ఆమె ఆ అవకాశాన్ని కోల్పోయారు.
ఎవరీ డేవిడ్ స్జాలాయ్?
డేవిడ్ స్జాలాయ్ కెనడియన్-హంగేరియన్-బ్రిటిష్ రచయిత. ఆయన మాంట్రియల్లో హంగేరియన్ తండ్రికి, కెనడియన్ తల్లికి జన్మించారు. ప్రస్తుతం ఆయన ఆస్ట్రియాలోని వియన్నాలో నివసిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు ఫిక్షన్ నవలలు రాసిన స్జాలాయ్, గతంలో 2016లో తన 'ఆల్ దట్ మ్యాన్ ఈజ్' (All That Man Is) నవల కోసం కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డు షార్ట్లిస్ట్లో నిలిచారు.
'ఫ్లెష్' గురించి... ఒత్తిడిలో రాశాను:
'ఫ్లెష్' నవలలో... మౌనంగా ఉండే ఇస్తావన్ అనే వ్యక్తి జీవితాన్ని స్జాలాయ్ సూటిగా వివరించారు. యుక్త వయసులో పెద్ద వయసు మహిళతో సంబంధం, ఆ తర్వాత బ్రిటన్కు వలస వచ్చి పడిన కష్టాలు, చివరికి లండన్ హై సొసైటీలో అసాధారణ వ్యక్తిగా మారడం వంటి జీవిత దశలను ఈ నవల ఆవిష్కరిస్తుంది.
నవలను లాంగ్లిస్ట్కు ఎంపిక చేసిన తర్వాత బుకర్ ప్రైజ్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్జాలాయ్ మాట్లాడుతూ... ఈ నవల హంగేరీలో మొదలై, ఇంగ్లాండ్లో ముగిసేలా, సమకాలీన యూరప్లోని "సాంస్కృతిక, ఆర్థిక విభేదాలను" అన్వేషించేలా తాను రాయాలనుకున్నానని చెప్పారు.
బుకర్ ప్రైజ్ అందుకుంటూ ఆయన, తాను దాదాపు నాలుగేళ్లు పనిచేసిన మరో నవలను మధ్యలో వదిలేశాక, భారీ ఒత్తిడిలో 'ఫ్లెష్' నవలను రాశానని తెలిపారు. "నా ఎడిటర్ను నేను ఒక ప్రశ్న అడిగాను, 'ఫ్లెష్' అనే పేరున్న నవలకు బుకర్ ప్రైజ్ వస్తుందని మీరు ఊహించగలరా?" అని, ఇప్పుడు దానికి సమాధానం దొరికిందని ఆయన నవ్వుతూ చెప్పారు. తన "రిస్క్తో కూడిన" నవలను గౌరవించినందుకు న్యాయ నిర్ణేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications