Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాబూల్ స్కూల్ వద్ద బాంబు పేలుళ్లు: 50 మంది మృతి, 100 మందికిపైగా గాయాలు

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో బాంబు పేలుళ్లు మరోసారి కలకలం రేపాయి. షియా ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతంలోని ఓ బాలికల పాఠశాల వద్ద బాంబు పేలుళ్లు జరిగాయి. బాలికలు ఇళ్లకు బయల్దేరుతున్న సమయంలో ఒక బాంబు పేలింది. ఆ తర్వాత రెండు రాకెట్ బాంబులను పేల్చారు.

ఈ వరుస బాంబు దాడిలో 50 మంది మరణించారు. వందమందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా యువతులే ఉన్నారు. పేలుళ్లపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

 Death toll soars to 50 in school bombing in Afghan capital Kabul

ఈ మేరకు వివరాలను ఆప్ఘాన్ మంత్రి తారీఖ్ అరియాన్ వెల్లడించారు. కాగా, కొందరు ప్రజలు అంబులెన్స్ లను అడ్డుకుని దాడులు చేయడంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారిందని, దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఆఫ్గాన్ ఆరోగ్యమంత్రి గులాం దస్తగిర్ నాజరి తెలిపారు. ఆ తర్వాత ప్రజలకు సర్దిచెప్పి అంబులెన్స్ లను ఆస్పత్రులకు తరలించామని చెప్పారు.

Recommended Video

    భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదు

    అయితే, ఈ బాంబు దాడులకు పాల్పడింది తామేనంటూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు. కాగా, ఈ దాడులు తమపని కాదంటూ తాలిబన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఇలాంటి నీచమైన దాడులకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే పాల్పడతారని తాలిబన్ సంస్థ ఆరోపించడం గమనార్హం.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+