వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
'విమాన ప్రమాదంతోనే నేతాజీ మృతి చెందారు'
లండన్: విమాన ప్రమాదం అనంతరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ తైపీలోని ఓ సైనిక ఆస్పత్రిలో మరణించారని బ్రిటన్కు చెందిన bosefiles.info అనే వెబ్సైట్ వెల్లడించింది. 1943 నుంచి 1945 వరకూ నేతాజీతో కలిసి పనిచేసిన అనువాదకుడు కాజునోరి కునిజుకా ఈ విషయాన్ని తెలిపారని పేర్కొంది.
ఇప్పటికీ జీవించివున్న కాజునోరి.. బోస్ చివరి రోజుల గురించి, 18 ఆగస్టు 1945న తైపీలో విమానప్రమాదం అనంతరం ఆయన మరణం గురించి పూర్తి వివరాలను ఒక డైరీలో పేర్కొన్నట్లు ఈ వెబ్సైట్ తెలియజేసింది.
నోబురు ఒకాబే అనే ప్రతినిధి ఈ డైరీ కాపీని వెబ్సైట్కి అందించినట్లు తెలిసింది. కాగా, bosefiles.info వెబ్సైట్ను నేతాజీ సమీప బంధువు అశీష్రే ఏర్పాటుచేశారు. ఆ డైరీ జపనీస్ భాషలో ఉందని, దాన్ని అనువాదం చేసి వెబ్సైట్ పొందుపర్చామని ఆశీష్ రే తెలిపారు.
Comments
subhash chandra bose netaji death accident japan website britain london సుభాష్ చంద్రబోస్ నేతాజీ మృతి ప్రమాదం జపాన్ బ్రిటన్ లండన్
English summary
Kazunori Kunizuka, who worked as an interpreter with Netaji Subhas Chandra Bose from 1943 to 1945, is still alive and has recorded in graphic detail in his diary the last days of Bose and his death as a result of a plane crash at Taipei on 18 August 1945, claims a website.
Story first published: Sunday, February 7, 2016, 15:19 [IST]