'దిత్వా' తుపాను బీభత్సానికి 123 మంది బలి, 130 మంది గల్లంతు !!
'దిత్వా' తుపాను భారీ విధ్వంసం సృష్టించింది. శ్రీలంకను అతలాకుతలం చేసిన ఈ తుపాను భారీ వర్షాలు, వరదలతో దేశాన్ని ముంచెత్తింది. ఈ కారణంగా ఇప్పటి వరకు 123 మంది మరణించగా.. మరో 130 మంది గల్లంతైనట్లు విపత్తు నిర్వహణ కేంద్రం (DMC) వెల్లడించింది. సుమారు 43,995 మంది నిరాశ్రయులయ్యారని.. వారిని ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలించినట్టు సమాచారం. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా తుపాను శ్రీలంక తీరం నుంచి భారత్ వైపు కదులుతున్నప్పటికీ.. దేశంలో తీవ్ర నష్టాన్ని కలిగించిందని అధికారులు పేర్కొన్నారు. రాజధాని కొలంబో గుండా ప్రవహించే కెలని నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో నదీ తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నాటికే కెలని నది ఉప్పొంగడంతో వందలాది మందిని తాత్కాలిక శిబిరాలకు తరలించారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, సాయుధ బలగాలు ఈ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయని వివరించారు.

ప్రస్తుతం హెలికాప్టర్లు, పడవల సహాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. 2016లో సంభవించిన వరదల కంటే ఈసారి పరిస్థితి మరింత తీవ్రంగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ విపత్కర పరిస్థితుల్లో శ్రీలంకకు భారత్ అండగా నిలిచింది. ఇప్పటికే బాధితుల కోసం విమానంలో సహాయ సామగ్రిని పంపింది. ప్రాణనష్టం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అవసరమైతే మరింత సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని 'ఎక్స్' వేదికగా హామీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఏపీ వైపు తుఫాను దిత్వా దూసుకురావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై అధికార యంత్రాంగానికి కీలక దిశా నిర్దేశం చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆ సమయంలో అత్యవసరం అయితే మినహా ఎవరూ బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉండడంతో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సర్కారు ప్లాన్ చేస్తోంది.
-
BCCI కు ఆ లక్కీ ఛాంప్ ఎలా దొరికింది? ప్రార్థన చేసి.. ప్రపంచ కప్ గెలిచి.. -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట!












Click it and Unblock the Notifications