ఒర్లాండో కాల్పుల ఘటన ట్రంప్కు కలిసొస్తుందా?
ఒర్లాండో: ఒర్లాండోలో జరిగిన గే నైట్క్లబ్ కాల్పుల ఘటన రిపబ్లికన్ల తరుపున అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్ట్ ట్రంఫ్కు కలిసొస్తుందా? అంటే అవుననే అంటున్నారు అమెరికాలోని ఇజ్రాయిల్ దేశ మాజీ రాయబారి మైఖెల్ ఓరన్. అమెరికా అధ్యక్ష ప్రచారం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ముస్లింలపై డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.
అమెరికాలోకి ముస్లిలంను రానివ్వొద్దనే ఆయన వాదనకు పలువురు అమెరికన్లు సైతం మద్దతు తెలిపారు. ముస్లింలను అమెరికాలోకి రానివ్వడం వల్లే ఉగ్రవాదం ఆ దేశంలో పెచ్చిరిల్లి పోయిందని పలు మార్లు బహిరంగ సభల్లో సైతం ప్రస్తావించారు. తాజా ఘటనపై ఇస్లామిక్ తీవ్రవాదంపై ట్రంప్ తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు.

నైట్ క్లబ్ ఘటనతో ముస్లింలపై తన వైఖరి సరైనదేనని మరోసారు రుజువైందని డొనాల్ట్ ట్రంఫ్ వ్యాఖ్యానించారు. ఓర్లాండోలో చోటు చేసుకున్న కాల్పుల ఘటనను అమెరికా చరిత్రలోనే పెద్ద దాడిగా ఆయన అభివర్ణించారు. ఒర్లాండో కాల్పుల ఘటన తర్వాత ఆ ఘటనను ఖండిస్తూ అధ్యక్ష బరిలో ఉన్న ట్రంప్ తన వరుస ట్వీట్టలో ఇస్లామిక్ ఉగ్రవాదంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఉగ్రవాదులపై, ముస్లింలపై తన దృక్పథం కరెక్టేనని ఈ ఘటన నిరూపించిందని, అమెరికన్లు మరింత తెలివిగా వ్యవహరించాల్సిన సమయం వచ్చిందంటూ ఆయన వరుస ట్వీట్లు చేశారు. తన ఆలోచన పట్ల ప్రజల కృతజ్ఞతల తనకు అవసరం లేదని, మరింత దృఢంగా, మరింత నిఘాతో ముందుకు వెళ్లాలని సూచించారు.
నైట్క్లబ్లో జరిపిన కాల్పుల సమయంలో ఒమర్ అల్లాహు అక్బర్ అంటూ అరిచాడని ట్వీట్ చేశారు. రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజాన్ని కూకటివేళ్లతో పెకిలించి తీరాల్సిందేనని తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఇస్లామిక్ ఉగ్రవాదం పట్ల స్మార్ట్గా వ్యవహరించాలన్నారు. ఉగ్రవాదం పట్ల కఠినంగా వ్వవహరించకపోతే అమెరికా చిన్నాభిన్నమవుతుందని ట్రంప్ అన్నారు.
అమెరికాను పాలిస్తున్న నేతలు బలహీనులని, అందువల్లే దేశ ప్రజలపై దాడులకు ముష్కరులు తెగబడుతున్నారని ఆయన విమర్శించారు. పాలకులు కఠినంగా లేకుంటే, ఓర్లాండోలో జరిగిన ఘటనలు మరిన్ని చూడాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ఓర్లాండో నైట్ క్లబ్ ఘటనపై యావత్ ప్రపంచం ముక్త కంఠంతో ఖండించింది.
ఈ క్రమంలో ఈ నవంబర్లో అమెరికా దేశాధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష బరిలో ట్రంప్ పోటీపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం చూపుతుందని పలువులు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఉగ్రవాదంపై అమెరికా మెతకవైఖరి అవలంభిస్తోందని పలువురు రిపబ్లికన్ పార్టీకి చెందిన నేతలు సైతం అంటున్నారు. ఇదే విషయాన్ని ట్రంప్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తేతే ఆ పార్టీకి కలిసొస్తుందని పలువురు రిపబ్లికన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజా ఘటనతో అమెరికన్లు ట్రంప్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని పలు అంతర్జాతీయ మీడియా సంస్ధలు పేర్కొన్నాయి.
-
ట్రంప్కు తలనొప్పి.. పుతిన్కు పండగ!: భారత్, చైనాకు రష్యానే దిక్కు! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం












Click it and Unblock the Notifications