జైలులో అగ్నిప్రమాదం : 17మంది మృతి
కారాకస్ : వెనిజులా కారాబొబొ జిల్లా జైలులో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదంలో 17 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో తొమ్మిది మంది పురుషులు, ఎనిమిది మంది మహిళలు ఉన్నారు.
11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
పాక్లో ఆత్మాహుతి దాడి: ఆరుగురు మృతి
వాయువ్య పాకిస్థాన్ ఖైబర్ జిల్లాలోని గిరిజన ప్రాంతంలో ఉన్న ఓ ప్రభుత్వ భవనం బయట ఆత్మాహుతి దాడి జరిగింది. ఆత్మాహుతి దాడిలో ఆరుగురు మృతి చెందారు. మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల్లో నలుగురు పోలీసులున్నారు. గాయపడిన వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మాహుతి దాడికి పాల్పడింది తాలిబన్లు లేదా ఇస్లామిక్ వర్గాలు దాడులు చేసినట్లు అక్కడి పోలీసులు భావిస్తున్నారు.