గుడ్ న్యూస్: కరోనా విరుగుడుకు ఆ వ్యాక్సిన్ ప్రయోగం సక్సెస్... అక్టోబర్ నాటికల్లా..!
ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనావైరస్ విరుగుడుకు ఇప్పటికే పలు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ను కనిపెట్టే పనిలో ఉన్నాయి. అయితే మోడర్నా అనే బయోటిక్ సంస్థ వ్యాక్సిన్ తయారు చేయడమే కాదు కొంతమందిపై ప్రయోగం చేయగా అది సత్ఫలితాలను ఇచ్చినట్లు తెలిపింది. ఈ వ్యాక్సిన 45 మందిపై ప్రయోగించినట్లు పరిశోధకులు చెప్పారు. ఈ వ్యాక్సిన్ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిజీస్లో తొలుత తయారు చేసి ఆ తర్వాత మనుషులపై పరిశోధకులు ప్రయోగించారు.

వైరస్ను అడ్డుకోనున్న వ్యాక్సిన్
ఇక మూడో దశలో పరీక్షలను జూలై 27 నిర్వహిస్తామని అప్పుడు 30వేల మందిపై వ్యాక్సిన్ ఇచ్చి ప్రయోగం చేస్తామని పరిశోధకులు చెప్పారు. ఇక క్లినికల్ ట్రయల్స్ అక్టోబర్ నెలకల్లా పూర్తి చేస్తామని పరిశోధకులు వెల్లడించారు. అయితే ఈ వ్యాక్సిన్ ఎంతమేరకు సురక్షితమో , ఏమేరకు ప్రభావం చూపగలదో ఆ కొంత సమయంలో కచ్చితంగా చెప్పలేమనే వాదనా వినిపిస్తోంది. ఇక ఈ వ్యాక్సిన్ ప్రయోగం ద్వారా ప్లేసిబో పొందిన వారికంటే వైరస్ బారిన పడే వారి అవకాశం చాలా తక్కువగా ఉందని నిరూపించాల్సి ఉంటుంది. ఫలితాలు త్వరగా వచ్చేందుకు కరోనావైరస్ హాట్స్పాట్గా గుర్తించిన ప్రాంతాల్లో నివాసం ఉండే మనుషులపై ప్రయోగించాలని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు అలాంటి ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని గుర్తించే పనిలో పడ్డారు.

ఒక్క వ్యాక్సిన్ మాత్రమే సరిపోదు
ఇక ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ బారి నుంచి తప్పించుకోవాలంటే వ్యాక్సిన్లు లేదా సరైన చికిత్స మాత్రమే రావాల్సి ఉంది. ఇందుకోసం ఎన్నో కంపెనీలు వ్యాక్సిన్ను రూపొందించే పనిలో పడ్డాయి. ఇదిలా ఉంటే ఒక్క వ్యాక్సిన్తో ఈ మహమ్మారిని అంతం చేయలేమని మరికొన్ని వ్యాక్సిన్లు రావాలని నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు. ఒక్క కంపెనీ బిలియన్ డోస్లలో వ్యాక్సిన్ను తయారు చేయలేదని చెబుతున్నారు ఇక మోడర్నా వ్యాక్సిన్ తయారీలో జన్యు పదార్థాలను వినియోగించారు. దీన్నే ఎంఆర్ఎన్ఏగా పిలుస్తున్నారు. ఇది కరోనావైరస్తో పోరాడగలిగే వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

45 మందిపై చేసిన ప్రయోగం సక్సెస్
మే నెలలోనే దీని గురించి మోడర్నా కంపెనీ చెప్పినప్పటికీ ఎక్కడో సరైన డేటా మిస్ అవుతుందని చాలామంది నిపుణులు అన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఫలితాలను బయటకు చెప్పలేమంటూ సంస్థ సమర్థించుకుంది. ఒకవేళ అప్పుడే చెప్పి ఉంటే షేర్ విలువపై అది ప్రభావం చూపేదని వెల్లడించింది. ప్రస్తుతం వచ్చిన ఫలితాలు తొలిదశ ప్రయోగానికి సంబంధించినవే అని చెప్పిన పరిశోధకులు తక్కువ, మీడియం, మరియు అధిక మోతాదు డోసులను తయారు చేసి వైరస్ను తట్టుకునే నిరోధక శక్తిని సృష్టించాలనే యోచనతోనే రూపొందించినట్లు చెప్పారు. ఇక ఈ ప్రయోగంలో పాల్గొన్న 45 మంది 18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయస్సు ఉన్నవారే అని చెప్పారు. 28 రోజుల వ్యవధిలో రెండు వ్యాక్సినేషన్లు చేసినట్లు చెప్పారు. ఇక వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత అందరిలోనూ వ్యాధినిరోధక శక్తి పెరిగినట్లు అబ్జర్వ్ చేసినట్లు పరిశోధకులు చెప్పారు.
Recommended Video
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications