మిషన్ మంగళ్: అంతరిక్షాన్నీ వదలట్లేదు: అంగారక గ్రహంపై ఆధిపత్య పోరు: టాప్-3 లిస్ట్
వాషింగ్టన్: అంతరిక్ష ప్రయోగాల్లో ఆధిపత్య పోరు మొదలైనట్టు కనిపిస్తోంది. అంగారక గ్రహంపై పెత్తనాన్ని సాగించడానికి మూడు దేశాలు పోటీ పడుతున్నాయి. ప్రయోగాల మీద ప్రయోగాలు సాగిస్తున్నాయి. ఈ మూడు దేశాల ప్రయోగించిన స్పేస్క్రాఫ్ట్స్ కొద్దిరోజుల తేడాతో అంగారకుడిపై ల్యాండ్ కావడం యాదృశ్చికమే అయినప్పటికీ.. దాని తీవ్రతను చాటుతున్నాయి. ఆ మూడు దేశాల దృక్కోణం వేర్వేరుగా ఏమీ లేదు. మార్స్పై జీవం ఉందనడానికి, నివాసం ఉండటానికి గల అవకాశాలను పరిశీలిస్తోన్నాయి. కొత్త విషయాలను కనుగొనడానికి తమవంతు ప్రయత్నాలు ప్రారంభించాయి.
Recommended Video
నాసా హెలికాప్టర్..
అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా పంపించిన ఓ మినీ హెలికాప్టర్.. మంగళవారం అంగారకుడిపై ల్యాండ్ కానుంది. ఆ వెంటనే తన ప్రయోగాలను ఆరంభిస్తుంది. అంగారక గ్రహం ఉపరితలంపై డ్రిల్లింగ్ను చేపట్టనుంది. దీని కోసం నాసా శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఓ రోబో హ్యాండ్ను దీనికి అమర్చారు. 1800 గ్రాముల బరువులో హెలికాప్టర్ను పోలి ఉన్న ఈ ల్యాండ్ రోవర్ను ఐఐటీ-మద్రాస్ ఆలమ్నీ బాబ్ బలరాం రూపొందించారు. గత ఏడాది టేకాఫ్ అయిన ఈ హెలికాప్టర్ మార్స్పై నిర్దేశిత ప్రదేశంలో దిగనుంది. ఆ వెంటనే ప్రయోగాలను చేపడుతుంది. మట్టి, ధూళిని సేకరించి దాన్ని నమూనాలను నాసా గ్రౌండ్ స్టేషన్కు పంపిస్తుంది.
యూఏఈ హోప్ రోవర్..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పంపించిన హోప్ రోవర్ కూడా కొద్దిరోజుల కిందటే అంగారక గ్రహం కక్ష్యలోనికి ప్రవేశించింది. ఆ వెంటనే దానికి మార్స్ ఫొటోలను భూమికి పంపించింది. హోప్ పేరుతో ఎమిరేట్స్ పంపించిన ఈ స్పేస్ క్రాఫ్ట్ తీసిన తొలి ఫొటోను ఎమిరేట్స్ శాస్త్రవేత్తలు విడుదల చేశారు. ఇప్పటిదాకా వెలుగులోకి రాని అంగారకుడి సరికొత్త రూపాన్ని హోప్ స్పేస్క్రాఫ్ట్ చిత్రీకరించింది. ఎమిరేట్స్ స్పేస్ ఏజెన్సీ ఛైర్పర్సన్ సారా అల్ అమీరీ ఈ ఫొటోను ట్వీట్ చేశారు. గత ఏడాది జులైలో ఎమిరేట్స్ ఈ స్పేస్క్రాఫ్ట్ను అంగారకుడిపైకి పంపించింది. ఈ నెల 10వ తేదీన అది ల్యాండయింది.
చైనా దూకుడు..
అంతరిక్ష ప్రయోగాల విషయంల చైనా దూకుడు పెంచింది. మార్స్పై పరిశోధనలను సాగించడానికి ప్రయోగించిన తియాన్వెన్-1 స్పేస్ క్రాఫ్ట్ వారం రోజుల కిందటే అంగారకుడి కక్ష్యలోనికి ప్రవేశించింది. హోప్ స్పేస్ క్రాఫ్ట్ ప్రవేశించిన రెండు రోజుల తరువాత ఇది ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఇది అంగారకుడి చుట్టూ పరిభ్రమిస్తోంది. అమెరికా, చైనా, ఎమిరేట్స్ గత ఏడాది జులైలో మార్స్పైకి స్పేస్ క్రాఫ్ట్లను పంపించగా.. అవన్నీ కొన్ని రోజుల తేడాతో కక్ష్యలోనికి ప్రవేశించాయి. ఈ వారంలో ఈ మూడూ దాదాపు ఒకేసారి అంగారకుడిపై ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications