Forbes: ఇంత కరవులోనూ.. ప్రపంచ కుబేరులు వీళ్లే..
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. నిరుద్యోగిత, పేదరికం పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఫోర్బ్స్ విడుదల చేసిన తాజా ప్రపంచ కుబేరుల జాబితా ప్రకారం.. వ్యాపారవేత్త, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఇక ఈ సంవత్సరం ఫోర్బ్స్ వార్షిక బిలియనీర్ల జాబితాలో రికార్డు స్థాయిలో ఏకంగా 3,428 మంది పేర్లు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే 400 మంది పెరుగడం విశేషం.
ఈ ఏడాది బిలియనీర్ల మొత్తం సంపద $20.1 ట్రిలియన్లుగా నమోదైంది. గత సంవత్సరం కంటే $4 ట్రిలియన్లు ఎక్కువ. టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ మస్క్ ఈ జాబితాలో తిరిగి అగ్రస్థానంలో నిలిచారు. 2025 నుండి ఆయన సంపద $497 బిలియన్లు పెరిగి, దాదాపు రెట్టింపై, $839 బిలియన్ల రికార్డు స్థాయికి చేరింది. మస్క్.. గూగుల్ సహ వ్యవస్థాపకులైన లారీ పేజ్ (రెండో స్థానం), సెర్గీ బ్రిన్ (మూడో స్థానం) ల సంపదకంటే మూడు రెట్లు అధికంగా ఉన్నారు.
ఇక ఈ లిస్టులో రెండో స్థానంలో గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్ నిలిచారు, సెర్గీ బ్రిన్ మూడో స్థానంలో ఉన్నారు. నాలుగో స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఉన్నారు. అలాగే ఫేస్ బుక్ సృష్టికర్త మార్క్ జుకర్ బర్గ్ ఐదో స్థానంలో, ఒరాకిల్ అధిపతి లారీ ఎల్లిసన్ ఆరో స్థానంలో నిలిచారు. ఇక ఏడో స్థానంలో LVMH కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ & కుటుంబం, ఎనిమిదో స్థానంలో సెమికండక్టర్స్ రంగం నుండి జెన్సెన్ హువాంగ్ నిలిచారు. తొమ్మిదో స్థానాన్ని బెర్క్షైర్ హాత్వే వారెన్ బఫెట్ దక్కించుకున్నారు.

అలాగే భారత్ నుండి ముఖేష్ అంబానీ 21వ స్థానంలో నిలిచారు. గౌతమ్ అదానీ 31వ స్థానంలో నిలిచారు. క్రిప్టోకరెన్సీ రంగం నుండి ఇటలీకి చెందిన జియాన్కార్లో దేవాసిని 22వ స్థానం, టిక్ టాక్ సృష్టికర్త చైనాకు చెందిన ఝాంగ్ యిమింగ్ 26వ స్థానంలో ఉన్నారు.












Click it and Unblock the Notifications