Gotabaya Returns SriLanka : తిరిగొచ్చిన గొటబాయ రాజపక్స-స్వదేశంలో శాంతితో రీఎంట్రీ
కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబాయ రాజపక్స ఎట్టకేలకు స్వదేశానికి తిరిగి వచ్చారు. దేశాన్ని తీవ్ర ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టిన రాజపక్స సోదరుల్లో ఒకరైన గోటబాయ.. చివరి నిమిషం వరకూ అధికారాన్ని వదులుకోలేదు. నిరసనకారులు అధ్యక్ష భవనంలోకి దూసుకురావడంతో చివరి నిమిషంలో పారిపోయారు. అనంతరం సింగపూర్, ఇతర దేశాల్లో తిరుగుతూ చివరికి శ్రీలంకకు చేరుకున్నారు.
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దేశం నుంచి పారిపోయిన ఏడు వారాల తర్వాత ఆయన తిరిగి వచ్చినట్లు విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. రాజపక్సే ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగినప్పుడు మంత్రులు , రాజకీయ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. హిందూ మహాసముద్ర దేశంపై అతని శాశ్వత ప్రభావానికి చిహ్నంగా అతను నాశనానికి దారితీశాడని విమర్శకులు అంటున్నారు.

టబాయ స్వదేశానికి రాగానే ఆయనకు ఇక్కడి రాజకీయ నేతలు స్వాగతం పలకడంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. సంక్షోభంలో దేశం వదిలి పారిపోయిన ఆయనకు స్వాగతం పలకడాన్ని కొందరు సమర్ధించుకుంటుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు.
శ్రీలంకలో గోటబాయ పారిపోయిన తర్వాత ఏర్పడిన ఆపద్ధర్మ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన విక్రమసింఘే అనంతరం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం నిరసనలు కూడా కాస్త శాంతించాయి. దీంతో దేశంలో సాధారణ పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఆర్ధిక ఇబ్బందుల్ని క్రమంగా అధిగమించేందుకు మార్గం సుగమమవుతోంది. దీంతో రాజపక్స తిరిగి దేశానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే గతంలో ఆయన చేసిన తప్పిదాలపై విక్రమసింఘే ప్రభుత్వం విచారణ చేయిస్తుందా లేదా అన్నది ఇంకా తేలలేదు.












Click it and Unblock the Notifications