వడ దెబ్బ: పాక్ లో 700 మంది పిట్టల్లా రాలిపోయారు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని ప్రజలు భానుడి దెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇంటి నుండి బయటకు రాలేక అల్లాడి పోతున్నారు. పిల్లలు, వృద్దులు మృత్యువాత పడుతున్నారు. వేడి గాలులతో పాకిస్థాన్ ప్రజలు విలవిలలాడుతున్నారు.
గత శుక్రవారం నుండి పాకిస్థాన్ లో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. శుక్రవారం నుండి మంగళవారం వరకు 700 మంది వడ దెబ్బకు బలి అయ్యారు. పాకిస్థాన్ లోని కరాచీ నగరంలో ఎక్కువ మంది మరణించారని అధికారులు వెల్లడించారు.
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన అన్ని సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని వసతులు కల్పించాలని సూచించారు.

దేశంలో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే భాద్యతను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు అప్పగించారు. వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోని ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.
భానుడి దెబ్బకు ఇప్పటికే విధ్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటిస్తు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సింధు ప్రావిన్స్ ప్రాంతాలలో ఇప్పటి వరకు 27,200 మంది బడ దెబ్బకు ఆసుపత్రిపాలైనారు. వడ దెబ్బ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications