92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా..
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ కు కీలక ఇంధన సరఫరాను తీర్చేందుకు భారత్ జెండాలు కలిగిన రెండు LPG ట్యాంకర్లు హార్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. పైన్ గ్యాస్, జాగ్ వసంత్ అనే రెండు నౌకలు సోమవారం ఉదయం పర్షియన్ గల్ఫ్ నుండి బయలుదేరి లరాక్- కేష్మ్ ఛానెల్ ద్వారా ఇరాన్ అధికారులకు తమ గుర్తింపును వెల్లడించాయని అధికారులు తెలిపారు. ఈ ట్యాంకర్లు కలిపి మొత్తం 92,000 టన్నుల ఎల్పీజీను తీసుకువస్తున్నాయి.
ఇది భారత్ ఒకరోజు వంటగ్యాస్ అవసరానికి దాదాపు సమానం అని తెలుస్తోంది. పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సింహా అందించిన సమాచారం ప్రకారం.. అవి రెండు రోజుల్లోనే భారత్ కు చేరుకుంటాయి. అంతకుముందు MT శివాలిక్, MT నందా దేవి నౌకలు 92,712 టన్నుల ఎల్పీజీని గుజరాత్ లోని ముంద్రా, కాండ్లా ఓడరేవులకు చేరవేశాయి. ఘర్షణల వల్ల చిక్కుకుపోయిన భారతీయ నౌకలను తరలించే ప్రయత్నాలకు ఇది నాంది పలికింది.
సంక్షోభం తీవ్రమైన సమయంలో 28 భారతీయ నౌకలు హార్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయాయి (వాటిలో 24 పశ్చిమ సెక్టారులో, 4 తూర్పు వైపున). కొన్ని సురక్షితంగా బయటపడినప్పటికీ 600 మంది నావికులతో 22 నౌకలు ఇంకా పశ్చిమ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇప్పటికే 11 మంది భారత నావికులు స్వదేశానికి తిరిగి చేరుకున్నారు. చిక్కుకుపోయిన వాటిలో ఎల్పీజీ, ఎల్ఎన్జీ, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు, కంటైనర్, బల్క్ క్యారియర్ లు వంటివి ఉన్నాయి.
చిక్కుకున్న నౌకలు, సిబ్బందిని సురక్షితంగా తరలించేందుకు ప్రభుత్వం చురుకుగా కృషి చేస్తోంది. నౌకల్లో ఆహారం, నీటి సరఫరా సరిపోతుందని అధికారులు తెలిపారు. ఇరాన్ అధికారులు యాజమాన్యం, సరుకు, అమెరికా సంబంధాలు లేవని ధృవీకరించిన తర్వాతే ప్రయాణానికి అనుమతిస్తున్నట్లు నివేదించబడింది.

హార్మూజ్ జలసంధి భారత్ కు కీలక ఇంధన రవాణా కారిడార్ గా ఉంది. భారత్ తన ముడి చమురులో దాదాపు 88 శాతం, సహజ వాయువులో 50 శాతం, ఎల్పీజీలో 60 శాతం ఇక్కడి నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఈ ట్యాంకర్ల సురక్షిత ప్రయాణం భారత్ ఇంధన భద్రతకు సానుకూల పరిణామంగా పరిగణిస్తారు.
-
US-Iran Talks: అమెరికాతో చర్చల్లో ఇరాన్ కు తొలి విజయం..! బంపర్ ఆఫర్..! -
అమెరికాకు అనూహ్య షాక్..! చర్చల కోసం ఇరాన్ 4 షరతులు..! -
Hormuz: హార్ముజ్ లో సీమైన్స్ కనిపెట్టలేం..! చర్చల వేళ బాంబుపేల్చిన ఇరాన్..! -
అమెరికా సైన్యాన్ని హార్మూజ్ సుడిగుండాల్లో కప్పెట్టేస్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
యుద్ధంలోకి అమెరికా నేవీ.. హార్మూజ్ జలసంధి అష్టదిగ్బంధనం.. ట్రంప్ సంచలన వార్నింగ్ -
కిలో బియ్యం రూ.600 - రూ.800.. కేజీ మాంసం రూ. 4000 పైనే !!! -
హర్మూజ్ ను దాటిన అమెరికా యుద్ధనౌకలు.. ఇదే తొలిసారి..! -
మరణించిన చిన్నారులతో ఇరాన్ స్పీకర్ 'శాంతి' ప్రయాణం! -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!!









Click it and Unblock the Notifications