92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా..
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ కు కీలక ఇంధన సరఫరాను తీర్చేందుకు భారత్ జెండాలు కలిగిన రెండు LPG ట్యాంకర్లు హార్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. పైన్ గ్యాస్, జాగ్ వసంత్ అనే రెండు నౌకలు సోమవారం ఉదయం పర్షియన్ గల్ఫ్ నుండి బయలుదేరి లరాక్- కేష్మ్ ఛానెల్ ద్వారా ఇరాన్ అధికారులకు తమ గుర్తింపును వెల్లడించాయని అధికారులు తెలిపారు. ఈ ట్యాంకర్లు కలిపి మొత్తం 92,000 టన్నుల ఎల్పీజీను తీసుకువస్తున్నాయి.
ఇది భారత్ ఒకరోజు వంటగ్యాస్ అవసరానికి దాదాపు సమానం అని తెలుస్తోంది. పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సింహా అందించిన సమాచారం ప్రకారం.. అవి రెండు రోజుల్లోనే భారత్ కు చేరుకుంటాయి. అంతకుముందు MT శివాలిక్, MT నందా దేవి నౌకలు 92,712 టన్నుల ఎల్పీజీని గుజరాత్ లోని ముంద్రా, కాండ్లా ఓడరేవులకు చేరవేశాయి. ఘర్షణల వల్ల చిక్కుకుపోయిన భారతీయ నౌకలను తరలించే ప్రయత్నాలకు ఇది నాంది పలికింది.
సంక్షోభం తీవ్రమైన సమయంలో 28 భారతీయ నౌకలు హార్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయాయి (వాటిలో 24 పశ్చిమ సెక్టారులో, 4 తూర్పు వైపున). కొన్ని సురక్షితంగా బయటపడినప్పటికీ 600 మంది నావికులతో 22 నౌకలు ఇంకా పశ్చిమ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇప్పటికే 11 మంది భారత నావికులు స్వదేశానికి తిరిగి చేరుకున్నారు. చిక్కుకుపోయిన వాటిలో ఎల్పీజీ, ఎల్ఎన్జీ, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు, కంటైనర్, బల్క్ క్యారియర్ లు వంటివి ఉన్నాయి.
చిక్కుకున్న నౌకలు, సిబ్బందిని సురక్షితంగా తరలించేందుకు ప్రభుత్వం చురుకుగా కృషి చేస్తోంది. నౌకల్లో ఆహారం, నీటి సరఫరా సరిపోతుందని అధికారులు తెలిపారు. ఇరాన్ అధికారులు యాజమాన్యం, సరుకు, అమెరికా సంబంధాలు లేవని ధృవీకరించిన తర్వాతే ప్రయాణానికి అనుమతిస్తున్నట్లు నివేదించబడింది.

హార్మూజ్ జలసంధి భారత్ కు కీలక ఇంధన రవాణా కారిడార్ గా ఉంది. భారత్ తన ముడి చమురులో దాదాపు 88 శాతం, సహజ వాయువులో 50 శాతం, ఎల్పీజీలో 60 శాతం ఇక్కడి నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఈ ట్యాంకర్ల సురక్షిత ప్రయాణం భారత్ ఇంధన భద్రతకు సానుకూల పరిణామంగా పరిగణిస్తారు.
-
గ్యాస్ సిలిండర్ బరువు తగ్గింపు? 10 కిలోల ప్లాన్తో సామాన్యులకు ఊరట -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
Iran: ట్రంప్ అల్టిమేటం వేళ హార్ముజ్ పై ఇరాన్ కీలక నిర్ణయం-ఆ కండిషన్ తో ..! -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
హోటల్స్ కు గుడ్ న్యూస్: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కోటా పెంపు -
రంజాన్ వేళ జెరుసలేమ్ పై ఇరాన్ క్షిపణి దాడి..వీడియో











Click it and Unblock the Notifications