జూన్ 11న జైలు నుంచి ఇమ్రాన్ ఖాన్ విడుదల..? భారత్ అలెర్ట్..!
భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ లో కీలక పరిణామం చోటుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ దేశ మాజీ ప్రధాని, తెహ్రీక్ ఈ ఇన్సాన్ పార్టీ(PTI) అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. జూన్ 11 న ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. పీటీఐ పార్టీ ఇన్ ఛార్జీ ఘోహర్ అలీ ఖాన్ ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. పాక్ లోని హైకోర్టు ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్.. ఆయన సతీమణి భుష్రా బీబీ కు బెయిల్ మంజూరు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ త్వరలో జైలు నుంచి బయటకు రానున్నట్లు పీటీఐ పార్టీ ఛైర్మన్ ఘోహర్ అలీ ఖాన్ తెలిపినట్లు సమాచారం అందుతోంది. ఇస్లామాబాద్ లోని హైకోర్టు ఈమేరకు జూన్ 11 న పిటిషన్లపై విచారణ జరిపి బెయిల్ ఇవ్వనున్నట్లు పీటీఐ నేతలు చెబుతున్నారు. వివిధ కేసుల్లో భాగంగా ఆయన 2023 నుంచి జైలు జీవితం గడుపుతున్నారు.
ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి అడియాలా జైలులో ఉంటున్నారు. అయితే ఆయనపై నమోదైన వివిధ కేసులను కొట్టివేయాలని కోరుతూ వచ్చిన పిటిషన్లను ఇస్లామాబాద్ హైకోర్టు జూన్ 11 న విచారించనుంది. ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ కు బెయిల్ రానున్నట్లు పీటీఐ పార్టీ ఇన్ ఛార్జీ ఘోహర్ అలీ ఖాన్ పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆయన సతీమణి భుష్రా బీబీ కు కూడా ఈ కేసుల్లో బెయిల్ లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

2023 నుంచి ఇమ్రాన్ ఖాన్ జైలులోనే ఉండటంపై అక్కడ రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన్ను వెంటనే విడుదల చేయాలంటూ పీటీఐ నేతలు బహిరంగంగా ఆందోళనలు చేస్తున్నారు. అయితే భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన భారత్ వైఖరిపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలని నిపుణులు అంటున్నారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications