భారత్-బంగ్లా మధ్య మరో చిచ్చు..!  ప్రధాని సలహాదారు స్క్రీనింగ్-రాయబారికి సమన్లు..!

భారత్, బంగ్లాదేశ్ (India Bangladesh) మధ్య దౌత్యపరమైన విభేదాలు మరోసారి ముదిరాయి. ఢిల్లీ విమానాశ్రయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరిని ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలిపివేయడం ఇరు దేశాల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ ప్రభుత్వం, వెంటనే స్పందించి ఢాకాలోని భారత డిప్యూటీ హైకమిషనర్‌ పవన్ బధేను పిలిపించి తన నిరసనను గట్టిగా వ్యక్తం చేసింది.

బంగ్లా ప్రధాని సలహాదారు అడ్డగింత

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ విధానపరమైన వ్యూహాత్మక వ్యవహారాల సలహాదారు జహీద్ ఉర్ రెహమాన్ ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. భారత్‌లో జరిగే ఒక అంతర్జాతీయ స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను, విమానాశ్రయ భద్రతా తనిఖీల్లో పేరు ఫ్లాగ్ కావడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు దాదాపు రెండున్నర గంటల పాటు నిలిపివేసి వివిధ ప్రశ్నలు వేశారు.

India Bangladesh Diplomatic Row After Top Bangladesh PM Advisor Detained At Delhi Airport

సమావేశానికి వెళ్లకుండానే వెనుదిరిగిన సలహాదారు

భారత అధికారులు ఆ తర్వాత ఆయన ప్రయాణానికి అనుమతించినప్పటికీ, తీవ్ర అసంతృప్తికి లోనైన జహీద్ ఉర్ రెహమాన్ తిరిగి స్వదేశానికి వెళ్లిపోయారు. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ సీనియర్ అధికారుల 28వ సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన సాధారణ పాస్‌పోర్ట్, సార్క్ వీసాపై భారత్ వచ్చారు. ఈ విషయమై బంగ్లాదేశ్ తాత్కాలిక విదేశాంగ మంత్రి డాక్టర్ ఖలీలుర్ రెహమాన్ స్పందిస్తూ, ఇది అత్యంత దురదృష్టకరమైన, అవాంఛనీయమైన సంఘటన అని అభివర్ణించారు.

భారత్ కు బంగ్లా బిగ్ షాక్..! తాజా అల్టిమేటం..!
భారత్ కు బంగ్లా బిగ్ షాక్..! తాజా అల్టిమేటం..!

గతంలో ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేసిన జహీద్ ఉర్ రెహమాన్, బంగ్లాదేశ్‌లో ప్రముఖ రాజకీయ విశ్లేషకునిగా ప్రాచుర్యం పొందారు. అధికారిక ఆహ్వానంపై వచ్చిన వ్యక్తి పట్ల ఢిల్లీ విమానాశ్రయంలో భారత భద్రతా సిబ్బంది ప్రవర్తించిన తీరుపై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ తీవ్ర నిరాశను వ్యక్తం చేసింది. అయితే ఈ వివాదానికి సంబంధించి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

India Bangladesh Diplomatic Row After Top Bangladesh PM Advisor Detained At Delhi Airport
సువేందు దూకుడు..! బంగ్లా బోర్డర్లో కంచెకు 600 ఎకరాలు-6 కీలక నిర్ణయాలు..!
సువేందు దూకుడు..! బంగ్లా బోర్డర్లో కంచెకు 600 ఎకరాలు-6 కీలక నిర్ణయాలు..!

మరోసారి చెడిన సరిహద్దు వాతావరణం

బంగ్లాదేశ్‌లో 2024 తిరుగుబాటు తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవడంతో భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తారిఖ్ రెహమాన్ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ద్వైపాక్షిక సంబంధాలు కొంత మెరుగైనట్లు కనిపించినా, ఇటీవల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మళ్లీ అగ్గి రాజేస్తున్నాయి. ముఖ్యంగా అక్రమ వలసదారుల బహిష్కరణ వ్యవహారం ఇరు దేశాల మధ్య కొత్త సరిహద్దు వివాదాలకు మరియు దౌత్యపరమైన దూరాన్ని పెంచడానికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ల్యాండింగ్ ఘటన ఇరుదేశాల సున్నిత బంధాన్ని మరింత క్లిష్టం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బంగ్లాదేశ్ అధికార వర్గాల తీవ్ర నిరసన నేపథ్యంలో, వచ్చే రోజుల్లో భారత ప్రభుత్వం ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇరు దేశాలు దౌత్య మార్గాల ద్వారా శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+