Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐదేళ్ల తర్వాత చైనా పౌరులకు భారత్ గుడ్‌న్యూస్!

ఐదేళ్ల తర్వాత చైనా పౌరులకు భారత్ గుడ్ న్యూస్ చెప్పింది. భారత సర్కారు చైనా పౌరులకు టూరిస్ట్ వీసా జారీ చేయడాన్ని తిరిగి ప్రారంభించింది. 2020లో గాల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీని కారణంగా వీసా, డైరెక్ట్ ఫ్లైట్ సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు ఐదేళ్ల తర్వాత మళ్లీ చైనా పౌరులకు వీసా జారీ చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మెరుగుపడనున్న సంబంధాలు
భారత ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని భావిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో భారత్, చైనా మధ్య కొన్ని కీలకమైన ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల తర్వాత మొదటగా ఇరుదేశాల మధ్య డైరెక్ట్ ప్యాసింజర్ విమాన సేవలను మళ్లీ ప్రారంభించడానికి అంగీకారం కుదిరింది. ఇప్పుడు వీసాలకు సంబంధించిన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయం తెలిసిన అధికారులు మాట్లాడుతూ.. ఈ ఏడాది జులైలో జారీ చేసిన ఒక ఆర్డర్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఆర్డర్‌లో చైనా పౌరులకు టూరిస్ట్ వీసాలను మళ్లీ ప్రారంభించాలని సూచించారు.

India Resumes Tourist Visas for Chinese Citizens After Five Years Diplomatic Ties Improve

కైలాస్ మానసరోవర్ యాత్ర కూడా ప్రారంభం
ఒక నెల క్రితం, ఐదేళ్లుగా నిలిచిపోయిన కైలాస్ మానసరోవర్ యాత్ర కూడా జూన్ 2025లో మళ్లీ ప్రారంభమైంది. ఇందులో భారతీయ తీర్థయాత్రికుల మొదటి బృందం టిబెట్‌లో ప్రవేశించింది.అంతకుముందు ఏప్రిల్ 1న దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని లీ కియాంగ్, ప్రధాని మోదీ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇది ఇరు దేశాల మధ్య స్థిరత్వం కోసం కొత్త నిబద్ధతకు సంకేతంగా చెప్పవచ్చు.

ఊపందుకున్న దౌత్య సంబంధాలు
ఈ ఏడాది భారత్, చైనా మధ్య దౌత్య సంబంధాలు మరింత వేగవంతమయ్యాయి. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ జులైలో బీజింగ్‌ను సందర్శించారు. అప్పుడు ఆయన మాట్లాడుతూ.. సంబంధాలు నెమ్మదిగా సానుకూల దిశలో కదులుతున్నాయని చెప్పారు. దీనికి అదనంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఆగస్టులో రెండు రోజుల పాటు భారత్‌కు వచ్చారు. ఈ సమయంలో ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడం, సంబంధాలను మెరుగుపరుచుకోవడం గురించి చర్చించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ ఏడేళ్ల తర్వాత ఆగస్టు 31న చైనాను సందర్శించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడ్డాయి.

గాల్వాన్ ఘర్షణ తర్వాత పరిస్థితి
2020లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత భారత్, చైనా మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఈ ఘర్షణలో పలువురు భారతీయ సైనికులు అమరులయ్యారు. అయితే చైనా తన నష్టాన్ని ధ్రువీకరించలేదు. ఈ సంఘటన తర్వాత ఇరు దేశాలు సరిహద్దులో సైనిక బలగాల మోహరింపును పెంచాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+