పాక్, చైనా ఓటు కూడా భారత్కే: ఐరాస భద్రతామండలి ఎన్నికల్లో ఘనవిజయం..సభ్యత్వం: ఏడాది
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితిలో భారత్ మరోసారి ఘన విజయాన్ని సాధించింది. భద్రతా మండలిలో అశాశ్వత సభ్యత్వం కోసం నిర్వహించిన ఎన్నికల్లో భారత్ విజయఢంకా మోగించింది. ఆసియా-పసిఫిక్ కేటగిరీలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో భారత్ ఏకపక్షంగా విజయాన్ని నమోదు చేసింది. ఆసియా-పసిఫిక్ దేశాలన్నీ భారత్కే ఓటు వేశాయి. చివరికి- చైనా, పాకిస్తాన్ కూడా భారత్ వైపే మొగ్గు చూపాయి. అనుకూలంగా ఓటు వేశాయి.
ఫలితంగా 2021-2022 సంవత్సరానికి భారత్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నాన్ పర్మనెంట్ మెంబర్గా కొనసాగుతుంది. సభ్యత్వ కాల పరిమితి ముగిసిన తరువాత మరోసారి ఎన్నికలను నిర్వహిస్తారు. అశాశ్వత సభ్య దేశం కోసం నిర్వహించిన ఎన్నికల్లో భారత్ ఘన విజయాన్ని సాధించడం ఇది ఎనిమిదో సారి. ఇదివరుకు ఏడుసార్లు వేర్వేరు దఫాలుగా భారత్ ఈ కేటగిరీలో విజయాన్ని సాధించింది.

మనదేశం తరఫున భద్రతా మండలి నాన్ పర్మనెంట్ మెంబర్ విభాగంలో టీఎస్ తిరుమూర్తి ప్రాతినిథ్యాన్ని వహిస్తారు. ఐక్యరాజ్య సమితిలో ఆయన భారత శాశ్వత ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆసియా-పసిఫిక్ కేటగిరిలో అశాశ్వత సభ్యత్వం కోసం నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం 192 ఓట్లు పోల్ అవగా.. అందులో 184 ఓట్లు భారత్కు పడ్డాయి. మిగిలిన ఎనిమిది ఓట్లు చెల్లనివిగా నిర్ధారించారు అధికారులు. చైనా, పాకిస్తాన్ సహా ఆసియా పసిఫిక్ దేశాలన్నీ భారత్కే ఓటు వేశాయి.

ఆసియా-పసిఫిక్ సహా వేర్వేరు కేటగిరీల్లో నిర్వహించిన ఎన్నికల్లో ఐర్లాండ్, మెక్సికో, నార్వే కూడా విజయాన్ని సాధించాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఆయా దేశాలన్నీ నాన్ పర్మనెంట్ మెంబర్గా విజయం సాధించాయి. కెనడా పోటీ చేసినప్పటికీ..ఓటమి చవి చూసింది. ప్రతి సంవత్సరం ఈ ఎన్నికలను నిర్వహిస్తుంటారు. మొత్తం 10 అశాశ్వత సభ్య దేశాలను ఎంపిక చేయడానికి ఈ ఎన్నికల ప్రక్రియను చేపడుతుంటారు.
మొత్తం 10 స్థానాల్లో అయిదు సీట్లను ఆసియా, ఆఫ్రికా దేశాలకు కేటాయిస్తారు. లాటిన్ అమెరికా, కరేబియన్ ద్వీప దేశాలు, పశ్చిమ యూరప్లకు రెండు చొప్పున, తూర్పు యూరప్కు ఒకటి చొప్పున స్థానాలను కేటాయిస్తారు. ఆయా ఉపఖండాల తరఫున ఎంపికైన దేశాలు భద్రతామండలిలో తమ గళాన్ని వినిపించాల్సి ఉంటుంది. ఆసియా-పసిఫిక్ కేటగిరీలో భారత్ ఘన విజయం సాధించడం పట్ల అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. భారత్ విజయాన్ని తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని పేర్కొంది.
-
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
ఖమేనీ సంధి ఒప్పందం? -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications