పాకిస్తాన్ జైల్లో భారతీయుడిపై హత్యాయత్నం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి మీద సాటి ఖైదీ దాడి చేశాడు. గాయాలైన భారతీయుడికి కనీసం వైద్యం చేయించలేదని బాధితుడి న్యాయవాది కోర్టును ఆశ్రయించాడు. అయినా జైళ్ల శాఖ అధికారులు పట్టించుకోలేదు.
పెషావర్ సెంట్రల్ జైల్లో హమీద్ నెహల్ అన్సారీ అనే భారతీయుడు మూడేళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాడు. పాకిస్తాన్ నకిలి ఐడీ కార్డు పెట్టుకోవడంతో పోలీసులు హమీద్ ను అరెస్టు చేసి పెషావర్ సెంట్రల్ జైలుకు పంపించారు.

అదే సెంట్రల్ జైల్లో ఉంటున్న పాకిస్తాన్ జాతీయుడు (ఖైదీ) హమీద్ మీద గురువారం దాడి చేశాడని పాకిస్తాన్ కు చెందిన మీడియా సంస్థ డాన్ శుక్రవారం వెల్లడించింది. హమీద్ మీద గతంలోనూ హత్యాయత్నం జరిగిందని, అతనికి గట్టి భద్రత కల్పించాలని హమీద్ న్యాయవాది కోర్టును ఆశ్రయించాడు.
ఈ విషయంపై జైలు సూపరిండెంట్ మసూద్ రెహమాన్ స్పందించారు. హమీద్ కు చిన్న చిన్న గాయాలైనాయని, జైల్లో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా జరుగుతుంటాయని నిర్లక్షంగా సమాధానం ఇచ్చాడు.
గాయాలైన హమీద్ ను ఆసుపత్రికి తరలిస్తామని చెప్పిన జైలు అధికారులు ఆ విధంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అతనికి కనీసం వైద్యం చేయించలేదని అతని న్యాయవాది ఆరోపిస్తున్నాడు. హమీద్ కు ప్రత్యేక భద్రత కల్పించాలని జైలు అధికారులకు చెప్పినా వారు పట్టించుకోవడం లేదని న్యాయవాది ఆరోపించారు.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో..











Click it and Unblock the Notifications