అఫైర్ అనుమానం: భార్యను చంపిన భారత సంతతి వ్యక్తి
మెల్బోర్న్: అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భారత సంతతి వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి చంపాడు. పర్మీందర్ సింగ్ అనే 29 ఏళ్ల వ్యక్తి తన బార్య నికిత చావ్లాను హత్య చేశాడు. ఆమె మొబైల్ ఫోన్ను చెక్ చేసిన పర్మిందర్ సింగ్ ఆమెకు ఇతరులతో లైంగిక సంబంధం ఉందని అనుమానించి ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఇంట్లో భార్యను చంపిన తర్వాత అతను పోలీసులను పిలిచి తన భార్యను పదే పదే కత్తితో పొడిచినట్లు వారి వద్ద చెప్పుకున్నాడు. ప్రాసిక్యూటర్ ఈ విషయాన్ని కోర్టుకు తెలిపారు. అతన్ని పోలీసులు అరెస్టు చేసి, హత్యా నేరం కింద అభియోగాలు మోపారు.
నిందితుడు మెల్పోర్న్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరై తన నేరాన్ని అంగీకరించాడు. ఆ తర్వాత తిరిగి మే 1వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ కోర్టు అతనికి రిమాండ్ విధించింది. కోర్టులో విచారణ జరుగుతుండగా సింగ్ తల దించుకుని డాక్లో కూర్చున్నాడు.
నిందితుడు బెయిల్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. ఉత్కంఠకు సంబంధించి సింగ్ గతంలో మానసిక వైద్యుడిని సంప్రదించినట్లు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టు ఆ విషయాన్ని నోట్ చేసుకుని కస్టడీకి రావడం తొలిసారి అని గుర్తించి మానసిక ఆరోగ్య పరీక్షకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు దర్యాప్తులో సిసిటీవి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అలాగే డిఎన్ఎ, ఫోరెన్సిక్ సాక్ష్యాలను సేకరిస్తున్నారు.