భారత్ సరిహద్దుల్లో ఐసిస్: బంగ్లాదేశ్లో పూజారి హత్య
ఢాకా: బంగ్లాదేశ్లో ప్రధాన హిందూ పూజారిని తుపాకులు, కత్తులతో దుండగులు దారుణంగా హత్య చేశారు. భారత్ సరిహద్దుల్లోని పంచగఢ్ జిల్లా శాంతగౌరియో ఆలయ పరిసరాల్లో ఆదివారం నాడు ఈ ఘటన జరిగింది.
ఇస్లామిక్వాదులుగా అనుమానిస్తున్న ముగ్గురు దుండగులు ఆలయ పరిసరాల్లోకి బైక్ పైన వచ్చారు. అనంతరం దేవాలయంపైకి రాళ్లు రువ్వారు. దీంతో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు పూజారి జోగేశ్వర్ దశ దికారి బయటకు వచ్చారు. వెంటనే ఆ దుండగులు పూజారిపై దాడికి దిగారు. కత్తితో ఆయన గొంతు కోశారు.

కాగా, ఇరాక్, సిరియాల్లో దారుణాలకు పాల్పడుతున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పూజారిని హతమార్చింది తామేనని ఐసిస్ ప్రకటించింది. ఈ హత్యకు తామే కారణమని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ఐసిస్ ప్రకటించింది.
చనిపోయిన పూజారీ బంగ్లాదేశ్ పంజాగఢ్లోని దేవీ గంజ్ ఆలయంలో జోగేశ్వర్ (55) పూజారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఐసిస్ ఉగ్రవాదులు కత్తులతో గొంతు కోయడంతో ఆ పూజారి అక్కడికక్కడే చనిపోయారు. యోగేశ్వర్ను కాపాడేందుకు యత్నించిన ఓ భక్తుడిపైనా విరుచుకుపడ్డ ఉగ్రవాదులు అతడిని గాయపర్చి పరారయ్యారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications