ఐసిస్ ఉగ్రవాదుల కోసం 5స్టార్ హోటల్, 300 మందిని చంపేశారు
బాగ్ధాద్: ఐసిస్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల కోసం ఇరాక్ దేశంలో ఓ ఐదు నక్షత్రాల హోటల్ తెరిచారు. ఐసిస్ పోరాటంలో అలసిన తన వర్గం ఉగ్రవాదులకు విశ్రాంతి కల్పించేందుకు ఆ ఉగ్రవాద సంస్థ ఈ హోటల్ను తెరిచింది. అయితే ఆ హోటల్లో నృత్యాలు, సంగీత్, ధూమపానం, జూదం ఉండవు.
ఇక్కడ మహిళలు తన నుండి పాదాల వరకూ నల్లటి దుస్తులు ధరించాలి. వారి చేతులకు గ్లౌజులు కూడా ఉండాలి. నినావా అనే ఈ హోటల్లో 262 గదులు ఉన్నాయి. ఐసిస్ కమాండర్లకు చాలా వరకు రిజర్వ్ అయి ఉంటాయి. పెళ్లిళ్లను కూడా అనుమతిస్తారు.

మరోవైపు, ఐసిస్ ఉగ్రవాదుల ఘాతుకాలు కొనసాగుతున్నాయి. దాదాపు మూడు వందల మంది యాజిది వ్యక్తులను నార్తర్న్ ఇరాక్లో చంపేశారు. యాజిదికి చెందిన గ్రామాల నుండి వేలాది మందిని తీసుకు వెళ్లారు. అందులో మూడు వందల మందిని హతమార్చారు.
దీనిని యాజిది ప్రోగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. దాదాపు నలభై వేల మంది యాజిది గ్రామస్థులను ఐసిస్ ఉగ్రవాదులు తీసుకెళ్లారని తెలుస్తోంది. యాజిది వారి పైన ఐసిస్ ఉగ్రవాదుల ఘాతుకాలని అందరూ ఖండిస్తున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications