ఐఎస్ఐఎస్ వెబ్ అకౌంట్ లకు చెక్: ప్రత్యేక పోలీసులు
లండన్: సోషల్ మీడియా నుండి ఉగ్రవాదుల ఖాతాలను తొలగించడానికి రంగం సిద్దం చేస్తున్నారు. వీలైనంత త్వరగా అన్ని అకౌంట్లను తొలగించాలని అధికారులు భావిస్తున్నారు. యూరప్ లో అందుకు ప్రత్యేకంగా పోలీసులను ఏర్పాటు చేశారు. ఆ పోలీసులకు యూరోపోల్ అని పేరు పెట్టారు.
ప్రత్యేక పోలీసు బృందాలకు సైబర్ క్రైం పోలీసులు పూర్తి సహకారం అందిస్తున్నారు. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) తీవ్రవాదులకు సంబంధించి సోషల్ మీడియాలో దాదాపు 50 వేల అకౌంట్లు ఉన్నాయని అధికారులు గుర్తించారు.

నిత్యం ఐఎస్ఐఎస్ కార్యకాలపాలకు సంబంధించి దాదాపు లక్ష ట్విట్లు చేస్తున్నారని గుర్తించారు.
ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులను హీరోలుగా చూపిస్తు నిత్యం ట్విట్లు చేస్తున్నారని, యువత వారి పట్ల ఆకర్షితులు అవుతున్నారని యూరప్ ప్రభుత్వం గుర్తించింది.
ఇలాంటి ట్విట్లు చేస్తున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులు నిర్ణయించారు.
అందుకోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా కంపెనీల సహకారంతో ఐఎస్ఐఎస్ కు సంబంధించిన అకౌంట్లను గుర్తిస్తున్నారు.
వెంటనే వాటిని తొలగించాలని నిర్ణయించారు. జులై 1 నుండి ఆ అకౌంట్ లు పూర్తిగా తొలగించాలని, వాటిని బ్లాక్ చెయ్యాలని ప్రత్యేక బృందం పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటి నుండి ఐఎస్ఐఎస్ కు మద్దతుగా ట్విట్ లు చేస్తున్న వారిని గుర్తిస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications