"లవ్ స్టోరీ" లీక్ చేసిన నెతన్యాహూ.. పడి పడి నవ్విన ప్రధాని మోడీ !
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ టూర్ రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త దిశగా నిలుస్తోంది. విమానాశ్రయం నుంచి అధికారిక కార్యక్రమాల వరకు ప్రధాని మోదీకి లభించిన ఘన స్వాగతం ఈ పర్యటన ప్రాధాన్యతను ప్రపంచ వ్యాప్తంగా మరింత చర్చనీయాంశంగా మార్చింది. ఇజ్రాయెల్ పార్లమెంట్లో జరిగిన సమావేశాలు, ద్వైపాక్షిక చర్చలు భారత్-ఇజ్రాయెల్ సంబంధాల బలోపేతానికి దోహదపడ్డాయి. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
భారతీయ రెస్టారెంట్లో మొదటి డేట్..
కాగా సంయుక్త విలేకరుల సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక వ్యక్తిగత విషయాన్ని పంచుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. తన భార్యతో మొదటి డేట్ ఒక భారతీయ రెస్టారెంట్లో జరిగిందని.. ఆ భోజనం ఎంతో ప్రత్యేకంగా ఉండటం వల్లే తమ బంధం మరింత బలపడిందని సరదాగా వ్యాఖ్యానించారు. భారత్కు తాను మాత్రమే కాకుండా తన కుటుంబం కూడా రుణపడి ఉందని చెప్పడంతో సభలో హాస్య వాతావరణం నెలకొంది. ఈ వ్యాఖ్యలపై మోడీ సైతం చిరునవ్వుతో స్పందించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ పర్యటనలో రెండు దేశాలు సాంకేతిక సహకారాన్ని మరింత విస్తరించేందుకు నిర్ణయించుకున్నాయి. ముఖ్యంగా ప్రెసిషన్ అగ్రికల్చర్, సాఫ్ట్వేర్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్ ఇన్నోవేషన్ రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఆవిష్కరణలు, రక్షణ, నీటి నిర్వహణ, ఆరోగ్య రంగాలకు సంబంధించిన మొత్తం 16 అవగాహన ఒప్పందాలు (MoUలు) కుదిరాయి.
భారత్-ఇజ్రాయెల్ మధ్య రక్షణ రంగంలో ఇప్పటికే ఉన్న సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నేతలు నిర్ణయించారు. ఆధునిక డ్రోన్ టెక్నాలజీ, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, సైబర్ భద్రత వంటి అంశాల్లో కలిసి పరిశోధనలు చేపట్టేందుకు చర్చలు జరిగాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమన్వయ చర్యలు కొనసాగించాలనే అంశంపై కూడా రెండు దేశాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. నీటి కొరతను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన మైక్రో ఇరిగేషన్, వాటర్ రీసైక్లింగ్ టెక్నాలజీలను భారత్లో విస్తృతంగా అమలు చేయాలని నిర్ణయించారు. రైతుల ఆదాయం పెంచే విధంగా స్మార్ట్ వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెట్టేందుకు సంయుక్త ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు తెలిపారు.
తదుపరి సమావేశం భారత్లో..
రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు త్వరలోనే భారత్లో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. ప్రభుత్వాల మధ్య సహకారంతో పాటు ప్రజల మధ్య అనుబంధం కూడా పెరుగుతోందని నెతన్యాహు పేర్కొన్నారు. వ్యక్తిగత స్నేహం, వ్యూహాత్మక భాగస్వామ్యం కలిసివస్తే మరిన్ని అవకాశాలు సృష్టించవచ్చని ఇద్దరు నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పర్యటన కేవలం ఒప్పందాలకు మాత్రమే పరిమితం కాకుండా ఇద్దరు దేశాధినేతల మధ్య ఉన్న స్నేహాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. సాంకేతికత, ఆర్థిక అభివృద్ధి, భద్రత రంగాల్లో సహకారం పెరగడంతో భారత్-ఇజ్రాయెల్ భాగస్వామ్యం మరింత బలపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
-
భారత్లోకి " పైప్డ్ " గ్యాస్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది కూడా అయిపోతుందా?? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications