Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సైలెంట్ కిల్లర్స్: ఇరాన్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ఇజ్రాయెల్ 'యూనిట్ 8200'!!

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ సంఘర్షణ ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక దేశాలను ప్రభావితం చేయడంతో, వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఇజ్రాయెల్ అత్యంత రహస్య గూఢచారి విభాగమైన 'యూనిట్ 8200’పైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. ఈ యూనిట్ ప్రత్యేకతలు, రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇరాన్‌ కీలక నాయకులను లక్ష్యంగా చేసుకుని హత్యలకు ఇజ్రాయెల్ ఈ యూనిట్‌ను వినియోగిస్తోందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అమెరికన్ వార్తాపత్రిక వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ, IRGC అధిపతి మహమ్మద్ పక్‌పూర్ వంటి ప్రముఖుల హత్యలలో యూనిట్ 8200 పాత్ర కీలకమైనది. గతంలోనూ, హిజ్బుల్లా అగ్ర నాయకులను కూడా ఈ యూనిట్ హతమార్చినట్లు సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన మోస్సాద్ కన్నా 'యూనిట్ 8200' అత్యంత ప్రమాదకరమైనదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సైబర్ సెక్యూరిటీ నైపుణ్యం, కెమెరా హ్యాకింగ్‌లు, సోషల్ మీడియా ద్వారా ఇరాన్ అంతటా విధ్వంసం సృష్టించగలిగిందని అంచనా. ఈ యూనిట్ ఆపరేషన్లలో కనీసం 40 మంది ఇరాన్ కీలక నాయకులు హత్యకు గురైనట్లు సమాచారం. ఇది మోస్సాద్‌కు భిన్నంగా, రక్షణ దళాలలో ప్రత్యేక గూఢచార విభాగంగా పనిచేస్తుంది.

ఇజ్రాయెల్‌లో యూనిట్ 8200ను "ష్మోనే మటైమ్" అని పిలుస్తారు. 1948లో స్థాపించబడిన ఈ విభాగం, ఇజ్రాయెల్ రక్షణ దళాల ఆధ్వర్యంలో పనిచేసే ప్రత్యేక గూఢచార సంస్థ. సైనిక కార్యకలాపాలకు కీలకమైన గూఢచార, సైబర్ సమాచారాన్ని అందించడమే దీని ప్రధాన లక్ష్యం. రాయిటర్స్ ప్రకారం, ఈ యూనిట్ అమెరికా NSA లేదా బ్రిటన్ GCHQతో సమానమైనది.

రక్షణ వర్గాల సమాచారం ప్రకారం, యూనిట్ 8200 రహస్య కార్యకలాపాలను నిర్వహిస్తుంది. సిగ్నల్స్ ఇంటెలిజెన్స్, డేటా మైనింగ్, సాంకేతిక దాడులతో సహా అనేక రంగాలలో ఇది ప్రావీణ్యం సంపాదించింది. కెమెరాను హ్యాక్ చేసి, ఇరాన్‌లో అయతోల్లా అలీ ఖమేనీ ఉన్న ప్రదేశాన్ని ఈ యూనిట్ గుర్తించినట్లు సమాచారం. ఇది ఇజ్రాయెల్ సైనిక దళాలలోనే అతిపెద్ద విభాగంగా గుర్తింపు పొందింది.

యూనిట్ 8200 గతంలో కూడా తన సామర్థ్యాలను నిరూపించుకుంది. 2005-2010 మధ్య కాలంలో, ఇరాన్ అణు ఉత్పత్తి సౌకర్యాలను ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ రహస్య ఆపరేషన్‌ను చేపట్టింది. ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం అందగా, సెంట్రిఫ్యూజ్‌లను ధ్వంసం చేయాలనే లక్ష్యంతో బాధ్యతను యూనిట్ 8200కు అప్పగించారు. ఈ పనిని యూనిట్ 8200 సునాయాసంగా పూర్తి చేసింది.

యూనిట్‌లో చాలా మంది సిబ్బంది 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు వారే. ఇజ్రాయెల్‌లోని అత్యంత యువ బృందాలలో ఒకటిగా ఇది పేరుపొందింది. భారీ ప్రాణనష్టాన్ని నివారించేందుకు, సిబ్బంది చిన్న బృందాలుగా విడిపోయి వ్యూహాత్మక కార్యకలాపాలు నిర్వహిస్తారని రక్షణ వర్గాలు తెలిపాయి. వారి సాంకేతిక నైపుణ్యం ఈ యూనిట్ సమర్థతకు నిదర్శనం.

మోస్సాద్ ప్రపంచంలోనే ప్రమాదకరమైన గూఢచార సంస్థల్లో ఒకటిగా సుపరిచితం. అయితే, మోస్సాడ్‌ను మించిన సామర్థ్యం గల మరో ప్రత్యేక దళం ఇజ్రాయెల్ వద్ద ఉందని అనేక దేశాలకు ఇంతకాలం తెలియదనే చెప్పాలి. ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా మధ్య ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో 'యూనిట్ 8200' పేరు మరోసారి తెరపైకి రావడంతో, దాని రహస్య కార్యకలాపాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+