మారణహోమం సృష్టించిన జిహాదీ మూకలు.. 100 మందికి పైగా మృతి
ఉత్తర బుర్కినా ఫాసోలో జిహాదీ మూకలు నరమేధం సృష్టించాయి. వారు చేసిన భారీ హింసాత్మక దాడుల్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో చాలా మంది సైనికులే ఉన్నారని తెలుస్తోంది. అలాగే పలువురు పౌరులు, మహిళలు, పిల్లలు కూడా ఈ ఉగ్ర దాడుల్లో బలయ్యారని సమాచారం.
డజిబో సహా పలు ప్రాంతాల్లో విచక్షణా రహితంగా దాడులు జరిపినట్టు స్థానికులు వాపోతున్నారు. బాధిత కుటుంబాల ప్రకారం.. దాడిలో కొందరు మహిళలు, బాలికలు అపహరణకు గురయ్యారని అంటున్నారు. ఈ ఘాతుక ఘటనల నేపథ్యంలో ప్రజల్లో భద్రతా వ్యవస్థపై తీవ్రమైన అసహనం వ్యక్తమవుతోంది. గత కొన్ని నెలలుగా బుర్కినా ఫాసోలో ఉగ్రవాద మూకల హింస పెరుగుతున్నా, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక భద్రతా దళాలు సరిగా స్పందించలేకపోతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

మరోవైపు ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తూ యునైటెడ్ నేషన్స్ సహా పలువురు అంతర్జాతీయ నేతలు స్పందించే అవకాశం ఉంది. ఈ తరహా ఘటనలపై గట్టి చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications