వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘మోడీజీ మీకే మా మద్దతు: 7 లక్షల కాశ్మీరీ పండిట్లు మీ వెనకాలే’

|
Google Oneindia TeluguNews

హూస్టన్: అమెరికాలోని హూస్టన్ లో జరిగే హౌడీ మోడీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీని అక్కడ నివాసముంటున్న కాశ్మీరీ పండిట్లు కలిశారు. సరికొత్త కాశ్మీర్ ఆవిర్భావానికి బాసటగా నిలుస్తామని వారు ఆయనతో అన్నారు.

ప్రధాని మోడీ ప్రత్యేక కానుక: భారత్ పై యూన్ చీఫ్ ప్రశంసలుప్రధాని మోడీ ప్రత్యేక కానుక: భారత్ పై యూన్ చీఫ్ ప్రశంసలు

జమ్మూకాశ్మీర్‌లో మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారనీ.. మనమందరం నవ కాశ్మీరం నిర్మిద్దామని ప్రధాని నరేంద్ర మోడీ కాశ్మీరీ పండిట్లతో అన్నారు. కాశ్మీరీ పండిట్ సురీందర్ కౌల్ మోడీతో భేటీకి సంబంధించిన విషయాలను వెల్లడించారు.

Kashmiri Pandits meet PM Modi in Houston, say 7 lakh Pandits thank Modi govt

జమ్మూకాశ్మీర్ అభివృద్ధి కోసం ప్రధాని మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా తాము మద్దతుగా ఉంటామని కాశ్మీరి పండిట్లు ప్రధానికి చెప్పినట్లు తెలిపారు. కాశ్మీరీ పండిట్ల తరపున ప్రధానికి వినతి పత్రం సమర్పించామని చెప్పారు.

ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకాశ్మీర్ ప్రగతి కోసం మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రపంచ వ్యాప్తంగా 7 లక్షల మంది కాశ్మీరీ పండిట్ల తరపున ధన్యవాదాలు తెలిపామని వివరించారు.

నమో థాలీస్: భారత ప్రధాని కోసం హూస్టన్ చెఫ్ ప్రత్యేక మెనూ!నమో థాలీస్: భారత ప్రధాని కోసం హూస్టన్ చెఫ్ ప్రత్యేక మెనూ!

కాశ్మీర్ ను శాంతియుత ప్రాంతంగా మార్చి అక్కడి ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలనే ప్రధాని మోడీ కల నెరవేరేందుకు తాము కూడా సహకరిస్తామని ఈ భేటీలో కాశ్మీరీ పండిట్లు స్పష్టం చేశారు.

English summary
Adelegation of Kashmiri Pandits met P Minister Narendra Modi in Houston on Sunday morning ahead of the 'Howdy, Modi' mega address while the group thanked him for the move on Jammu and Kashmir and said that 7,00,000 Kashmiri Pandits are indebted to his government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X