పనిలో పని.. పాకిస్థాన్ నూ లేపేస్తే పోలా..!!
ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పాకిస్థాన్ డిఫెన్స్ మంత్రి అసిఫ్ ఖవాజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్, అఫ్గానిస్తాన్, భారత్ కలిసి పాకిస్థాన్ పై కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. పాకిస్థాన్ ను సామంత దేశంగా మార్చేందుకు ఈ దేశాలు ప్లాన్ చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఇజ్రాయెల్ పెత్తనాన్ని పాకిస్థాన్ బోర్డర్ వరకూ తీసుకురావాలని కుట్రలు పన్నుతున్నట్లు కీలక ఆరోపణలు చేశారు.
అమెరికాతో అణ్వాయుధ ఒప్పందానికి ఇరాన్ సిద్ధంగా ఉన్నా ఆ దేశంపై యుద్ధం చేస్తున్నారని పాకిస్థాన్ రక్షణ మంత్రి అసిఫ్ ఖవాజా మండిపడ్డారు. ఇజ్రాయెల్ ఆధిపత్యాన్ని పాకిస్థాన్ సరిహద్దుల వరకూ విస్తరించి.. పాకిస్థాన్ ను సామంత దేశంగా మార్చాలని ఈ దేశాలు కుట్రలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అఫ్గానిస్తాన్ , భారత్ తో పాటు పాకిస్థాన్ కు సరిహద్దు దేశాలు కలిసి.. తమను టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు.
ఈ దేశాలు జాయింట్ సింగిల్ పాయింట్ ఎజెండాగా ముందుకు వెళ్తున్నాయని పాకిస్థాన్ సరిహద్దు చుట్టూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పి, బోర్డర్ చుట్టూ శత్రు దేశాలతో నింపి చివరకు పాకిస్థాన్ ను సామంత రాజ్యంగా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నాయని ఖవాజా అన్నారు. ఈ మేరకు పాకిస్థాన్ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. పార్టీలు, రాజకీయాలు, మతాలకు అతీతంగా అందరూ ఏకమై ఈ కుట్రలను తిప్పికొట్టాలని ఖవాజా పిలుపునిచ్చారు.
ప్రస్తుతం పాకిస్థాన్- అఫ్గానిస్తాన్ మధ్య దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. మరోవైపు భారత్- అఫ్గానిస్తాన్ మధ్య దౌత్య పరమైన సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్థాన్ మధ్య సంబంధాలు రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ డిఫెన్స్ మంత్రి అసిఫ్ ఖవాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇక ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. శనివారం ప్రారంభమైన దాడుల్లో ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు క్షిపణులు, డ్రోన్ దాడులతో రెచ్చిపోయాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. దాంతో ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ తోపాటు గల్ఫ్ దేశాలపై దాడులకు పాల్పడుతోంది. యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, సైప్రస్, ఇరాక్, జోర్డాన్ తదితర దేశాలపై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపిస్తోంది.
-
T20 World Cup Final: సౌతాఫ్రికాతో పైనల్ వీళ్లకే- పాక్ మాజీ కెప్టెన్ జోస్యం..! -
రూ.50 లక్షలు వరకు సర్కారు ఆర్ధికసాయం.. మీకు కావాలా ?? -
IND vs Eng: ఇంగ్లండ్ పై భారత్ కు ఎడ్జ్ వీరిద్దరే-గవాస్కర్ తాజా లెక్క..! -
"హోలీ" విషెస్ పేరుతో లింక్స్.. ఓపెన్ చేస్తే అకౌంట్లో డబ్బులు స్వాహానే ! -
India: ఇరాన్ దెబ్బకు బైబై ట్రంప్..! మళ్లీ పుతిన్ వైపు భారత్ చూపు? -
'మేడ్ ఇన్ చైనా' ఆయుధాలతో బొక్క బోర్లాపడ్డ ఇరాన్..! -
పాకిస్థాన్ షాకింగ్ నిర్ణయం.. మార్చి 31 వరకు.. -
T20 World Cup 2026: పాక్ ఆటగాళ్లకు పీసీబీ భారీ జరిమానా! -
పాకిస్థాన్పై డ్రోన్ దాడి.. ఎయిర్బేస్ లక్ష్యంగా భీకర దాడులు! -
భారత్తో ఇరాన్ సుప్రీం లీడర్ "ఖమేనీ"కి ఉన్న ప్రత్యేక సంబంధం ఇదే !! -
T20 World Cup ఫైనల్ వీరి మధ్యే..! తేల్చేసిన ఏఐ ప్లాట్ ఫామ్స్..! -
IND Vs ENG: సెమీస్ వర్షంలో కొట్టుకుపోతే, ఫైనల్ చేరేదెవరు - ఐసీసీ తాజా రూల్స్..!!












Click it and Unblock the Notifications