కొండ చరియలు పడి, 33 మంది మృతి (వీడియో)
కాట్మండ్: కొండ చరియలు విరిగిపడి 33 మంది మృత్యువాత పడిన సంఘటన నేపాల్ లో జరిగింది. నేపాల్ లోని కస్కి జిల్లా లో బుధవారం భారీ వర్షాలు పడ్డాయి. ఈ దెబ్బకు కస్కిలోని అనేక గ్రామాలలో నివాసం ఉంటున్న ప్రజలు బయటకు రాలేక వారి గ్రామాలలోనే చిక్కుకుని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
నేపాల్ లో ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రాలలో కస్కి జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఈ ప్రాంతంలో చాలఎత్తులో పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. భారీగా కురిసిన వర్షాలకు కొండచరియలు ఒక్క సారిగా కుప్పకూలిపోయాయి. విషయం తెలుసుకున్న ఆర్మీ అధికారులు రంగంలోకి దిగాయి.
ఆర్మీ అధికారులకు రెస్య్కూ సిబ్బంది సహకరిస్తున్నారు. ఇప్పటి వరకు 33 మంది మరణించారు. 31 మంది గల్లంతు అయ్యారని అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడి 27 ఇండ్లు నేలమట్టం అయ్యాయి. బ్రిడ్జిలు తెగిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నదని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications